Revanth Reddy to Visit KCR: హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం యశోద ఆసుపత్రికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇటీవలే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు పరామర్శించనున్నారు.


ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరదితరులు కూడా యశోద ఆస్పత్రికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


ఎన్నికల్లో ఓటమి ఎదురైన నాటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఫామ్ హౌస్‌లో కేసీఆర్ జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ కేసీఆర్ పొందుతున్న విషయం తెలిసిందే.


శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల టీమ్ తుంటి మార్పిడి సర్జరీ చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి డాక్టర్లు కూడా విడుదల చేశారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం హిప్ రీప్లేస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని 12గంటల లోపు నడిపించాలని అందులో భాగంగానే కేసీఆర్ శనివారం కొంత సమయం నడిచారని వైద్యుల బృందం తెలిపింది. ఈ మేరకు ఆర్థోపెడిక్ సర్జన్ ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో కేసీఆర్ నడిపించినట్లు చెప్పారు. కేసీఆర్‌ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ను నడిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.