Challenge politics in Telangana: తెలంగాణ రాజకీయాల్లో నీరు నిప్పులు కురిపిస్తోంది. నీటి వాటాల ఒప్పందాలు, బనకచర్లపై చర్చించేందుకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ లో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే సవాల్ విసురుతున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలోనూ ఇదే సవాల్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. 72 గంటల సమయం ఇస్తున్నాం ప్రిపేర్ అయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని రివర్స్ కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అక్కర్లేదని.. తాము చాలని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ కౌంటర్ పై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. అసెంబ్లీకి రమ్మంటే.. ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ పెడతామని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్ధం కానట్లుందని మంత్రి సీతక్క అన్నారు. విదేశాల్లో ఉన్న కేటీఆర్ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే మీడియా సమావేశం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే.. కేటీఆర్ ప్రెస్క్లబ్కు రమ్మనడం ఏంటి? ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది ప్రెస్క్లబ్లో చర్చించడానికి కాదన్నారు. బీఆర్ఎస్ డెడ్ అయిన పార్టీ.. డెడ్లైన్ పెట్టడం విడ్డూంగా ఉంది. కేటీఆర్.. నీ సొంత చెళ్లే నిన్ను నాయకుడిగా గుర్తించడం లేదంటూ సీతక్క ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర నేతలు కూడా ఇవే సవాళ్లు చేశారు.
మరో వైపు కేసీఆర్ రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాల ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం , బనకచర్ల వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ ప్రెస్మీట్ పెడతారని అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేన్తో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాల పత్రాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన, చేస్తున్న అన్యాయాలను వివరించే పత్రాలను వెలుగులోకి తెస్తారని అంటున్నారు. అయితే ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. రెండు రోజుల్లో ఉండవచ్చని అంటున్నారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ పెట్టిన 72 గంటల ప్రెస్మీట్ టార్గెట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.
అయితే ఇలాంటి చర్చలకు అసెంబ్లీ కరెక్ట్ గా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ ముందుకు వస్తే..అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ పదే పదే సవాల్ చేస్తున్నారు. అలాంటి సమయంలో విడిగా ప్రెస్ మీట్ పెడితే ప్రయోజనం ఉంటుందా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీలో పోటాపోటీగా జరిగే సమావేశాలు, చర్చల్లో ది నిజమో.. ఏది అబద్దమో బయటపడుతుంది. అసెంబ్లీలో ఒక వేళ బీఆర్ఎస్ నేతలు తగిన సమయం ఇవ్వకపోతే ఆ విషయాన్ని ప్రజలు చూస్తారు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ.. ప్రెస్ మీట్లకు.. ప్రెస్ క్లబ్ చర్చలకు సవాల్ చేస్తుందన్నది కాంగ్రెస్ వర్గాల ప్రశ్న. ఈ సవాళ్ల రాజకీయం ఎన్ని రోజులు ఉంటుందో కానీ తెలంగాణ పాలిటిక్స్ మాత్రం హాట్ హాట్ గా ఉంటున్నాయి.