Breaking News Live: శ్రీకాకుళం జిల్లా రాజాం డిఏవి స్కూల్లో కరోనా కలకలం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 11 Dec 2021 02:52 PM

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉంటుంది. అందుకే మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం...More

శ్రీకాకుళం జిల్లా రాజాం డిఏవి స్కూల్లో కరోనా కలకలం

శ్రీకాకుళం జిల్లా రాజాం డిఏవి స్కూల్లో కరోనా కలకలం రేపింది. గురువారం ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్దారించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చయగా... మరో 9 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. పిల్లలకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించారు.