Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

Advertisement

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Jan 2022 09:57 PM
చింతామణి నాటక ప్రదర్శన నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

చింతామణి నాటక ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం పట్ల  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలని ఆర్యవైశ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 

Continues below advertisement
సీపీఐ రామకృష్ణకు కరోనా పాజిటివ్

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం రామకృష్ణ స్వల్ప లక్షణాలతో హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని,  తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. 

Background

ఓమిక్రాన్ అరంగేట్రంతో తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందులో భాగంగా గతంలో తరహాలో రాత్రి 9 గంటల తర్వాతి నుంచి ఉదయం వరకూ నైట్ కర్ఫ్యూ విధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులను పొడిగించారు. ఈ క్రమంలోనే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ సహా జనాలు అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు. నేడు (జనవరి 17) మధ్యా్హ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశం ఉన్నందున రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.


ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పోచారం సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రోజువారీ కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నియంత్రణ కోసం చర్యలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, కరోనా పరీక్షలు మరింత సంఖ్యలో చేయడం, వ్యాక్సిన్‌లు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పర్చడం వంటి చర్యలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అనాథల సంక్షేమం, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు కరవుభత్యం, దళితబంధుకు నిధుల మంజూరు, వంటి అంశాలు అజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


పొట్టేలు తల నరకబోయి మనిషి తల నరికి..
మదనపల్లె రూరల్ మండలం వలసపల్లెలో స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద మద్యం మత్తులో ఉన్న తలారి.. పొట్టేలు అనుకుని ఓ వ్యక్తి తల నరికేశాడు. అక్కడ జరిగింది చూసిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. పొలిమేరలో గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకొచ్చారు. తలారి లక్ష్మణ్ కుమారుడు తలారి సురేష్‌(35) పొట్టేలును పట్టుకుని నిల్చున్నాడు. మరో తలారి చలపతి అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. బలిచ్చే సమయం కాగా, అంతా ఒకే అన్నారు. కానీ మద్యం మత్తులో ఉన్న తలారి చలపతి పొట్టేలు తలకు బదులుగా తలారి సురేష్ తలపై కత్తితో వేటు వేశాడు.  ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడ్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.


తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు చలపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో ఉండటం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.