Breaking News Live: జగిత్యాలలో టీఆర్ఎస్ నేతలు కత్తితో పొడిచి చంపిన దుండగుడు

Advertisement

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Jan 2022 09:23 PM
ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. వయోభారంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. టీటీడీ ఆస్థాన శాశ్వతపండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి. పురాణాలను శాస్త్రబద్ధంగా చెబుతూ ఎందరో ఆస్తికులకు ధర్మ మార్గాన్ని చూపించారు.  

Continues below advertisement
జగిత్యాలలో టీఆర్ఎస్ నేతలు కత్తితో పొడిచి చంపిన దుండగుడు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో దారుణం జరిగింది. టీఆర్ఎస్ నేత లక్ష్మయ్యను దుండగుడు కత్తితో పొడిచి చంపాడు.

Background

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భోగి పండగ సంబరం అంబరాన్నంటింది. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడినా.. తెల్లవారే సమయానికి వా తెరపివ్వడంతో పండగ సందడి మొదలైంది. అర్థరాత్రి నుంచే యువత రోడ్లపైకి వచ్చి భోగి మంటల ఏర్పాట్లు చేశారు. తెల్లవారు ఝామున 3 గంటలకల్లో ప్రతి ఇంటి ముందు భోగిమంటలు మొదలయ్యాయి. గ్రామంలోని కూడళ్లలో, పెద్ద పెద్ద కొయ్యలు తీసుకొచ్చి భోగిమంటలు వేశారు. అభిమాన హీరోల బ్యానర్లు కట్టి సందడి చేశారు.


దుర్గమ్మ ఆలయంలో భోగి సందడి..
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు కార్యక్రమం జరిగింది. భోగి మంటలు వెలిగించిన ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు సీమెచ్. నాగ వెంకట వరలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజినీర్లు కేవీఎస్ కోటేశ్వరరావు, లింగం రమాదేవి
కార్యక్రమం నందు పాల్గొన్న ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


కడప నగరంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకుని ఆట, పాటలు, నృత్యాలతో హోరెత్తించారు ప్రజలు. ప్రతి సంక్రాంతి ఏటా కడప లో చిలకమర్రి కుటుంబం లో ప్రతి ఒక్కరూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక్క చోటుగా చేరి నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులమంతా ఒక్క చోట చేరి సంబరాలు చేసుకుంటామని ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంక్రాంతి కి కలుసుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి నృత్యాలు వేస్తూ భోగి మంటలవద్ద ఆనందంగా గడిపారు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.


ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని  పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.‌. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుండి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పల్లకిలో మాడావీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు.. అనంతరం వారహస్వామి ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి గట్టు వద్ద సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాన్ని  నిర్వహించారు.. అనంతరం వేదమంత్రోచ్ఛరణల నడుమ శుభముహుర్తంలో పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని అర్చకులు మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.. కోవిడ్ ఆంక్షలు దృష్ట్యా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులను టీటీడీ అనుమతించలేదు.


విశాఖలో సందడి
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ వైజాగ్‌లో ప్రజల సంబరాలకు హద్దే లేకుండా పొయింది. తెల్లవారుజామునే అందరి ఇళ్ల ముందు అపార్ట్మెంట్ వాకిళ్లలో.. వీధి చివర్లో భోగి మంటలు వేస్తూ ప్రజలు తమ సంతోషాన్ని వెల్లడించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మిస్ అయిన సంతోషాన్ని వారు ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో జరువుకున్నారు. థర్డ్ వేవ్ భయపెడుతున్న నేపథ్యంలో పెద్ద పెద్ద గుంపులుగా కాకుండా చిన్న సమూహాలుగానే భోగి మంటల చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ సంక్రాంతికి స్వాగతం పలికారు విశాఖ ప్రజలు.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.