Trains Timings News: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో చాలా వరకు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. కాజీపేట - బల్హార్షా సెక్షన్‌లో బుధవారం (జూన్ 26) నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ - రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. దాని పనుల కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మరో 26 రైళ్లను దారి మళ్లించనున్నట్లు చెప్పారు. వివిధ రైళ్లల్లో కొన్నింటిని కనీసం ఒక రోజు రద్దు చేయగా.. మరికొన్నింటిని గరిష్టంగా 11 రోజుల వరకు రద్దు చేశారు.


రద్దు చేసిన రైళ్లు
జూన్ 26 నుండి జూలై 6 వరకు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు (12757/12758)
జూన్ 28, జూలై 5న పుణే - కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ (22151) 
జూన్ 28, జూలై 5న కాజీపేట - పుణే ఎక్స్‌ప్రెస్ (22152) 
జూన్ 28న హైదరాబాద్ గోరఖ్ పూర్ (02575) 
జులై 30న గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌
జులై 2న ముజఫర్‌పుర్‌ - సికింద్రాబాద్‌ (05293) 
జూన్‌ 27, జులై 4న సికింద్రాబాద్‌ - ముజఫర్‌పుర్‌ (05294)
జూన్‌ 29న గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303)
జులై 1న జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304)
గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న,
జూన్‌ 26, 27, 28 తేదీల్లో సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు
జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు
జూన్‌ 27, 29 తేదీల్లో సికింద్రాబాద్‌ - సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు


దారి మళ్లించిన రైళ్లు
తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడిపించనున్నారు. కాజీపేట నుంచి వెళ్లే సికింద్రాబాద్‌ - న్యూఢిల్లీ (12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముత్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. 


న్యూదిల్లీ - సికింద్రాబాద్‌ (12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీలలో ముత్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మళ్లించిన మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లు ఉండవు. సికింద్రాబాద్‌ - నిజాముద్దీన్‌ (ఢిల్లీ), నిజాముద్దీన్‌ - సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపించనున్నారు.