WhatsApp Channel: వాట్సాప్ తన యాప్‌కి నిరంతరం మార్పులు చేస్తూ కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది. వాట్సాప్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. దీని ఫీచర్ల కారణంగా మరింత జనాదరణ పొందనుంది. వాట్సాప్ దాని పాత ఫీచర్లను అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది లేదా దాని యాప్‌లో కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తూ ఉంటుంది. తద్వారా వినియోగదారులు ఈ యాప్ వైపు ఆకర్షితులవుతారు.


వాట్సాప్ ఛానెల్ కొత్త రూపం
ఈసారి వాట్సాప్ తన ఛానెల్‌లకు సంబంధించిన ఫీచర్లను విడుదల చేయడం ప్రారంభించింది. వాట్సాప్ గురించి అప్‌డేట్‌లను అందించే వెబ్‌సైట్ WABetaInfo కథనం ప్రకారం వాట్సాప్ దాని ఛానెల్స్‌ను అప్‌డేట్ చేయడం ప్రారంభించింది. వాట్సాప్ ఛానెల్స్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించి కొత్త రూపాన్ని విడుదల చేస్తున్నారు. ఇది పాత డిజైన్‌కు భిన్నంగా కనిపిస్తుంది.


ఇది కాకుండా వాట్సాప్ ఛానెల్‌ని పిన్ చేసే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు వినియోగదారులు వాట్సాప్‌లో తమకు ఇష్టమైన చాట్ బాక్స్‌ను పిన్ చేయగలరు. దాని ద్వారా వాట్సాప్‌ను తెరిచిన తర్వాత వారు తమకు ఇష్టమైన వ్యక్తి లేదా గ్రూప్ ఛాట్‌ను వెతకవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది పైనే ఉంటుంది.


ఛానెల్‌లో పిన్నింగ్ ఫీచర్ కూడా
అదేవిధంగా వాట్సాప్ తన ఛానెల్‌ని పిన్ చేసే ఫీచర్‌ను కూడా రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు కంపెనీ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లోని ఎంపిక చేసిన కొంతమంది టెస్టర్ల కోసం ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు కంపెనీ సాధారణ యూజర్ల కోసం కూడా ఈ ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించింది.


వాట్సాప్ వినియోగదారులు త్వరలో వాట్సాప్ ఛానెల్‌కు సంబంధించిన కొత్త రూపాన్ని కూడా చూడవచ్చు. దాంతో పాటు వినియోగదారులు తమకు ఇష్టమైన ఛానెల్‌ని కూడా పిన్ చేయవచ్చు. ఆ తర్వాత వినియోగదారులు తమ అభిమాన ఛానెల్ అప్‌డేట్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.


వాట్సాప్ ఇటీవలే మరో కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ లాక్ స్క్రీన్ నుండి నేరుగా స్పామ్‌ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ స్పామ్ మెసేజ్‌ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లకు వారి మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మరింత కంట్రోల్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లకు స్పామ్ మెసేజ్‌లు చాలా సంవత్సరాలుగా ఆందోళన కలిగిస్తున్నాయి. స్పామ్ మెసేజ్‌ల్లోని ప్రమోషనల్ కంటెంట్, మోసపూరిత కంటెంట్ నుంచి వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు స్పామ్ సందేశాల ద్వారా మోసానికి గురయ్యారు. వాట్సాప్ తెచ్చిన ఈ ఫీచర్ వినియోగదారుల ప్రైవసీకి చాలా ముఖ్యమైనది. యూజర్లు తమ లాక్ స్క్రీన్ నుంచే డైరెక్ట్‌గా స్పామ్ మెసేజ్‌లపై యాక్షన్ తీసుకుని వాటిని బ్లాక్ చేయగలరు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?