How to stay safe from KYC scams: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల కారణంగా ప్రజలు ప్రతిరోజూ కోట్లాది రూపాయలను కోల్పోతున్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారు కష్టపడి సంపాదించిన డబ్బును క్షణంలో ఖాళీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కేవైసీ (Know Your Customer) అప్‌డేట్ పేరుతో చాలా మంది మోసపోతున్నారు. కేవైసీ అనేది బ్యాంకులు, ఇతర సంస్థలు తమ కస్టమర్ల గుర్తింపును ధృవీకరించే ప్రక్రియ. దానిలోని లోపాలను ఆసరాగా తీసుకుని మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారు.

Continues below advertisement


కేవైసీ పేరుతో మోసం ఎలా జరుగుతోంది?
సైబర్ మోసగాళ్లు రుణాల కోసం దరఖాస్తు చేస్తున్నారు లేదా ఒకరి వ్యక్తిగత సమాచారం లేదా నకిలీ పత్రాల ఆధారంగా ఖాతాలను సృష్టించడం ద్వారా అక్రమ లావాదేవీలు చేస్తున్నారు. ఇవే కాకుండా వేరే వారి ఫోటోను ట్యాంపరింగ్ చేసి నకిలీ పత్రాలు తయారు చేస్తారు లేదా ఎవరి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. దీని వలన ప్రజలకు తెలియకుండానే వారి పేరు మీద లేదా వారి ఖాతా నుంచి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. దాని పర్యవసానాలను ఆ ఖాతా ఎవరి పేరు మీద ఉంటుందో వారు తరువాత శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. 



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


అటువంటి మోసాలను ఎలా అడ్డుకోవాలి?
పెరుగుతున్న సైబర్ నేరాల మధ్య అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరైనా మిమ్మల్ని ఖాతా వివరాలు లేదా కేవైసీ సంబంధిత సమాచారం కోసం అడుగుతుంటే సంస్థ నుంచి ధృవీకరించకుండా ఏ సమాచారాన్ని ఇవ్వకండి. ఏ బ్యాంకు లేదా ఇతర సంస్థ తన కస్టమర్‌లను ఓటీపీ, పాస్‌వర్డ్, పిన్ నంబర్లు అడగదు.


ఈరోజుల్లో పోలీసు అధికారిగా నటిస్తూ వ్యక్తిగత సమాచారం అడిగే కేసులు పెరిగిపోతున్నాయి. అటువంటి కాల్ సమయంలో ఓపికగా ఉండండి. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి. పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లో ఆధార్, పాన్ నంబర్ మొదలైనవాటిని షేర్ చేయవద్దు. మీరు సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!