దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ట్వీటర్ కొత్త సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. జాక్ డోర్సే సీఈవో పదవి నుంచి తప్పుకోవడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు.


ఈ సందర్బంగా పరాగ్ అగర్వాల్, ‘నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మీ స్నేహానికి, మీ మెంటార్ షిప్‌కు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. మీరు రూపొందించిన కల్చర్, సోల్, పర్పస్‌లకు నేను రుణపడి ఉంటాను. ’ అని జాక్ డోర్సేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.