టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌, ప్రపంచకప్‌ల కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మళ్లీ కలిశారు! ఓ యాడ్‌ షూటింగ్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. షూటింగ్‌ మధ్య ఖాళీ సమయంలో వీరిద్దరూ సోఫాపై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని యువీ తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టుకున్నాడు.


ఒకప్పుడు యువీ, ధోనీ టీమ్‌ఇండియాకు మూల స్తంభాలుగా ఉండేవారు. మిడిలార్డర్లో వీరిద్దరే కీలకంగా ఆడేవారు. మొదట్లో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. మహీకి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత విభేదాలు వచ్చాయని వదంతులు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగానే యువీని పక్కన పెట్టాడని ధోనీపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం వీరు మాట్లాడుకుంటున్న తీరు చూస్తే మాత్రం అలాగేమీ కనిపించడం లేదు.






ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో యువీ 104 వన్డేలు ఆడాడు. 3077 పరుగులు చేశాడు. 88.21 స్ట్రైక్‌రేట్‌తో ఆరు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు కొట్టాడు. ధోనీ నేతృత్వంలోనే టీమ్‌ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. యువీ ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. రెండేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన యువీ మళ్లీ పిచ్‌ మీదకు వస్తున్నానని సూచనలు ఇవ్వడం తెలిసిందే. మంగళవారం సైతం ఓ ట్వీట్‌ చేశాడు.






Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!


Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!


Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!


Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్‌ సర్‌ప్రైజ్‌..! సెంకడ్‌ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్‌


Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!


Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి