T20 World Cup: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు అనంతరం T 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును BCCI ప్రకటించనుంది. సెప్టెంబరు 10లోగా T20 ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలు ఆయా జట్లను ప్రకటించాలని ICC ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలు జట్లను ప్రకటించాయి.


Also Read: ICC's EAP Qualifiers Cancelled: T20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లు రద్దు... ప్రకటించిన ICC


కాగా, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు అనంతరం BCCI భారత జట్టును ప్రకటించనుంది. సెప్టెంబరు 7న BCCI 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటిస్తుంది. UAE, ఓమన్‌లో ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీ జరగనుంది.     


ఈ నెల 19 నుంచి IPL - 2021 మిగతా సీజన్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి BCCI జట్టును ఎంపిక చేద్దాం అనుకుంది. కానీ, ICC సెప్టెంబరు 10 నాటికి డెడ్ లైన్ విధించడంతో ముందుగానే జట్టును ప్రకటించాల్సి వచ్చింది. 


Also Read: IND vs ENG, 4th Test: టీమిండియా జట్టులోకి ప్రసిద్ధ్... రేపటి నుంచి నాలుగో టెస్టు... తుది జట్టులో స్థానం దక్కించుకుంటాడా?


15 మంది జట్టుతో పాటు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లకు BCCI అవకాశం ఇవ్వనుంది. పృథ్వీ షా, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్ ఈ ముగ్గురికి రిజర్వ్ ప్లేయర్లగా చోటు దక్కే అవకాశం ఉందని అంచనా. మరోపక్క సూర్య కుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్‌కి జట్టులో స్థానం దక్కుతుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. 


తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. అక్టోబరు 24న ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 31న న్యూజిలాండ్, నవంబరు 3న అఫ్గానిస్థాన్, నవంబరు 5న సూపర్ 12లో క్వాలిఫై అయ్యే జట్టుతో పోటీ పడనుంది. 


These 15 players would most likely be a part of Team India at the T20 World Cup.



Players expected to be a part of Team India: Rohit Sharma, KL Rahul, Shikhar Dhawan, Virat Kohli (c), Suryakumar Yadav, Rishabh Pant (wk), Shreyas Iyer, Hardik Pandya, Ravindra Jadeja, Yuzvendra Chahal, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Varun Chakraborty and Mohammad Siraj .