ICC World Cup: ఆస్ట్రేలియన్ పురుషుల లేదా మహిళల క్రికెట్ జట్టు అయినా వారి ఆధిపత్యం ఐసీసీ ప్రపంచ క్రికెట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 19 పరుగుల తేడాతో ఆతిథ్య దేశాన్ని ఓడించి ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో అత్యధిక ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న కంగారూ మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా మాజీ వెటరన్ ఆస్ట్రేలియా పురుషుల జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టింది.


మెగ్ లానింగ్ 2014 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా జట్టుకు సారథ్యం వహించింది. దీని తర్వాత 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. అనంతరం 2018 టీ20 ప్రపంచ కప్‌లో మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అద్భుతంగా పునరాగమనం చేసి కప్ గెలుచుకుంది.


మరోవైపు 2020లో ఆస్ట్రేలియాలోనే టీ20 ప్రపంచకప్ జరిగినప్పుడు ఆతిథ్య దేశం తన చివరి మ్యాచ్‌లో భారత్‌ను 85 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు నాలుగోసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఇది కాకుండా 2022 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు, జట్టుకు కెప్టెన్‌గా మెగ్ లానింగే ఉంది.


దీంతో ఐసీసీ ట్రోఫీని ఐదు సార్లు గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా మెగ్ లానింగ్ రికార్డు సృష్టించింది. తనకు ముందు ఆస్ట్రేలియా మాజీ వెటరన్ రికీ పాంటింగ్ కెప్టెన్‌గా నాలుగు సార్లు ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కెప్టెన్‌గా మూడు సార్లు ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నాడు.


ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రీడాకారిణిగా మెగ్ లానింగ్ మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం 18 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. అయితే ఐదు మ్యాచ్‌లలో ఎటువంటి ఫలితం రాలేదు.


మరోవైపు మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు గానూ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెత్ మూనీకి గుజరాత్ జెయింట్స్ పెద్ద బాధ్యతను అప్పటించింది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌కు గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా బెత్ మూనీని నియమించింది. గుజరాత్ జెయింట్స్ మార్చి 4వ తేదీన డివై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. బెత్ మూనీ చాలా కాలంగా ఆస్ట్రేలియా మహిళల జట్టులో కీలక సభ్యురాలుగా ఉంది.


ఇటీవల ఆడిన మహిళల టీ20 వరల్డ్ ఫైనల్ మ్యాచ్‌లో బెత్ మూనీ జట్టు తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. తను 53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో తన స్ట్రైక్ రేట్ 139.62గా ఉండటం విశేషం. ఆస్ట్రేలియా విజయంలో ఆమె ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జట్టులో బెత్ మూనీ టాప్ స్కోరర్‌గా నిలిచింది.