తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. కానీ ఈ పతకం గెలిచే క్రమంలో ఎంతో డ్రామా నటించింది. చైనాకు చెందిన యు వాన్ని రేసును ముందుగానే ప్రారంభించింది. తన వెంటనే జ్యోతి రేసును మొదలుపెట్టింది.


అధికారులు మొదట ఇద్దరూ ఫాల్స్ స్టార్ట్ చేశారని ప్రకటించారు. కానీ ఎంతోసేపు డిస్కషన్ తర్వాత జ్యోతి సరిగ్గానే ప్రారంభించిందని నిర్ణయించారు. రేసు ముగిశాక కూడా రివ్యూ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డాయి. జ్యోతి యర్రాజి రజతం సాధించిందని ప్రకటించారు. చైనా అథ్లెట్ యు వాన్ని రేసు నుంచి డిస్‌క్వాలిఫై అయింది.


మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతినే బంగారు పతకానికి బలమైన కంటెండర్‌గా నిలిచింది. కానీ జపాన్‌కు చెందిన మకో ఫుకుబే స్వర్ణాన్ని గెలుచుకుంది. 12.78 సెకన్లలో జ్యోతి రేసును పూర్తి చేసింది. ఇది ఆమెకు సెకండ్ బెస్ట్.


అయితే తన ప్రదర్శనతో సంతృప్తి చెందలేదని జ్యోతి గతంలో కూడా ఒకసారి తెలిపింది. ‘ఇది నా బెస్ట్ అని కచ్చితంగా చెప్పలేను. గతంలో సాధించిన ఘనతలకు పొంగిపోయే దాన్ని కాదు నేను. నా రికార్డులను నేనే మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నాను.’  అని జ్యోతి తెలిపారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial