క్రిస్ గేల్ ఎంత ఎంటర్‌టైనరో అందరికీ తెలిసిందే. ఈ ఎడమ చేతి వాటం డేంజరస్ బ్యాటర్ ఐపీఎల్ వచ్చే ఎడిషన్‌లో ఆడకపోయినా ఇప్పటికీ అభిమానులను, అతని చుట్టూ ఉన్నవారిని అలరిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ మినీ వేలం రోజున జియో సినిమా కవరేజ్ ఈవెంట్‌లో గేల్ నిపుణుల ప్యానెల్‌లో భాగమయ్యాడు. ఎప్పటి లాగానే గేల్ రోజంతా ఉల్లాసంగా అత్యుత్తమంగా ఉన్నాడు. ఒకదాని తర్వాత మరొకటి పంచ్‌ల వర్షం కురిపించాడు.


నికోలస్ పూరన్ IPL వేలంలో అత్యంత ఖరీదైన వెస్టిండీస్ ప్లేయర్ అయిన వెంటనే అతనికి డబ్బు అప్పుగా ఇవ్వడం గురించి గేల్ చమత్కరించాడు. ‘హేయ్ నికోలస్ పీ. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు?’ అని కామెడీ చేశాడు. 27 ఏళ్ల యువ ఆటగాడైన నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.






పంజాబ్‌కు ధావన్ కెప్టెన్సీ
ఐపీఎల్ 2023లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉంటాడని పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్రకటించింది. గత సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్‌తో విడిపోవాలని ఫ్రాంఛైజీ నిర్ణయించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రూ.8.25 కోట్లకు మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.


ఈ టాప్-ఆర్డర్ బ్యాటర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఆడనున్నట్లు తెలిసిన వెంటనే, మయాంక్ తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ట్విట్టర్‌లోకి వెళ్లాడు. "@SunRisers 🙌🏽 #OrangeArmyలో భాగమైనందుకు ఆనందంగా ఉంది" అని రాశారు. 2023 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.