Rajasthan 4 Wicket Win Over Rcb: చివరి వరకు  ఉత్కంఠగా  జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్(RR) సునాయాసంగా విజయం సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌ లో ఓడించి  బెంగళూరు(RCB)ను ఇంటికి పంపించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.  దానిని సంజు శాంశన్ సేన 6 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలి ఉండగానే  ఛేదించింది. 


బెంగళూరు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ ఉత్సాహంగా బరిలోకి దిగింది.  5 ఓవర్ల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 15 బాల్స్ లో 20 పరుగులు చేసి  టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ పెవిలియన్ చేరాడు. 10 వ ఓవర్లో జైస్వాల్‌ 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కాగా 11 వ ఓవర్ లో శాంసన్‌ కూడా అవుట్ అయ్యాడు. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ దూకుడుగా ఆడారు. సంజు శాంశన్ 17 పరుగులు చేయగా ధ్రువ్‌ జురెల్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. బెంగళూరు బౌలర్ లలో  సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.  ఈ ఓటమితో బెంగళూరు  ఇంటిదారి పట్టింది. దీంతో ఈసారంనా కప్పు గెలవాలన్న ఆశలు అడియాసలు అయ్యాయి. 


dబెంగుళూరు ఇన్నింగ్స్ ఇలా.. 


ఐపీఎల్ 17వ సీజన్‌  ప్లేఆఫ్స్‌లో భాగంగా  అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో పిచ్ అనుకూలంగా ఉండటంతో టాస్ గెలుచుకున్న రాజస్థాన్‌ బౌలింగ్  ఎంచుకుంది. మొదట్లో డుప్లెసిస్, విరాట్ కోహ్లీ  నిలకడగా ఆడగా  37 పరుగుల వద్ద  బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు జట్టు  50 పరుగులు చేసింది.  బాటర్లు ఆచి తుచి ఆడుతుండటంతో పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు 76 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్ లలో  అత్యధిక స్కోర్  34 పరుగులు రజత్ పటిదార్ చేయగా మహిపాల్ లోమ్రోర్ 32 పరుగులు ,  విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్‌ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 


కోహ్లీ రికార్డ్:


ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ  ఐపీఎల్‌లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సీజన్లో  అద్భుత ఫీట్ సాధించిన మొదటి  ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రికార్డ్ కు చేరువలో కోహ్లీ తరువాతి  స్థానాల్లో  శిఖర్ ధావన్ (6769 పరుగులతో), రోహిత్ శర్మ ( 6628 పరుగులతో )ఉన్నారు.