Rohit Sharma Lowest Strike Rate: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఐదో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.


తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 172 పరుగుల విజయ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఓ ఇబ్బందికర రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో స్ట్రైక్ రేట్ అత్యంత దారుణంగా ఉన్న తొలి కెప్టెన్ అతనే.


చెత్త స్ట్రైక్ రేట్
ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ క్రీజులో బాగా ఇబ్బంది పడ్డాడు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొనేందుకు అతడు చాలా కష్టపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 10 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 10.


కనీసం 10 బంతులు ఆడిన తర్వాత ఐపీఎల్‌లో ఏ జట్టు కెప్టెన్‌కైనా ఇది చెత్త స్ట్రైక్ రేట్. ఇది మాత్రమే కాదు రోహిత్ శర్మ ఐపీఎల్ 2022లో కూడా రెండు మ్యాచ్‌లలో ఇదే విధమైన ప్రదర్శన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 15.38, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 25 మాత్రమే. రోహిత్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.


ఓటమితో ప్రారంభం
ఐపీఎల్ 2022లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. గతేడాది బ్రబౌర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో IPL 2023లో కూడా ముంబై ఓటమితో ప్రారంభమైంది. గత సీజన్‌లో రోహిత్ శర్మ జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. IPL 2022లో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. గతేడాది రోహిత్ సేన 14 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలవగలిగింది. అయితే ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ గత ఏడాది తమ ప్రదర్శనను మరిచిపోవాలనుకుంటోంది. ఈసారి టీమ్‌లో చాలా మంది అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు.


ఐపీఎల్-16 సీజన్ లో  రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకే అందుబాటులో ఉంటాడట. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో నయా మిస్టర్ 360  సూర్యకుమార్ యాదవ్ ముంబైని నడిపించనున్నట్టు ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.  మూడేండ్ల తర్వాత  ఐపీఎల్ లో అందుబాటులోకి వస్తున్న ‘హోం అండ్ అవే’  ప్రకారం ఫ్రాంచైజీలు.. తమ హోమ్ గ్రౌండ్ తో  పాటు  ప్రత్యర్థి  స్వంత వేదికలపైనా ఆడాల్సి ఉంటుంది. అయితే టీమ్ తో పాటు  ప్రయాణించే రోహిత్..   మ్యాచ్ లకు మాత్రం డుమ్మా కొడతాడని  సమాచారం.


ఐపీఎల్-16 సీజన్ లో  రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకే అందుబాటులో ఉంటాడట. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో    నయా మిస్టర్ 360  సూర్యకుమార్ యాదవ్ ముంబైని నడిపించనున్నట్టు ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.  మూడేండ్ల తర్వాత  ఐపీఎల్ లో అందుబాటులోకి వస్తున్న ‘హోం అండ్ అవే’  ప్రకారం ఫ్రాంచైజీలు.. తమ హోమ్ గ్రౌండ్ తో  పాటు  ప్రత్యర్థి  స్వంత వేదికలపైనా ఆడాల్సి ఉంటుంది. అయితే టీమ్ తో పాటు  ప్రయాణించే రోహిత్..   మ్యాచ్ లకు మాత్రం డుమ్మా కొడతాడని  సమాచారం.