IND vs ENG 2nd Test Score Live: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3 ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్
భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.
ABP DesamLast Updated: 13 Aug 2021 11:03 PM
Background
భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 276/3 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే భారత్ 500 పరుగుల మార్కును దాటడం ఖాయం. England Playing XI: Rory...More
భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 276/3 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే భారత్ 500 పరుగుల మార్కును దాటడం ఖాయం. England Playing XI: Rory Burns, Dominic Sibley, Haseeb Hameed, Joe Root (c), Jonny Bairstow, Jos Buttler (wk), Moeen Ali, Sam Curran, Ollie Robinson, Mark Wood, James AndersonIndia Playing XI: Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Mohammed Shami, Ishant Sharma, Jasprit Bumrah, Mohammed Siraj
ఆతిథ్య ఇంగ్లాండ్తో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 276/3తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 126.1 ఓవర్లలో 364 పరుగులకి ఆలౌటైంది. జేమ్స్ అండర్సన్కి 5 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 245 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు బర్న్స్, రూట్ వికెట్ కాపాడుకూంటూ నిలకడగా ఆడుతున్నారు. 33 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. Rory Burns 43 Joe Root25 క్రీజులో ఉన్నారు.
రెండు వరుస బంతుల్లో సిరాజ్ ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. టీ విరామం నుంచి వచ్చిన తర్వాత బంతి అందుకున్న సిరాజ్ 15వ ఓవర్లో రెండు, మూడు బంతులకు ఓపెనర్ సిబ్లే(11), హసీబ్ హమీద్ (0) ను ఔట్ చేశాడు.
లంచ్ విరామం తర్వాత టీమిండియా ఇషాంత్ శర్మ వికెట్ కోల్పోయింది. అండర్సన్ వేసిన బంతికి ఇషాంత్ LBWగా వెనుదిరిగాడు. 125 ఓవర్లకు టీమిండియా 363/8 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జడేజా(39), బుమ్రా ఉన్నారు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 300 మార్కును అందుకుంది. 102వ ఓవర్లో సామ్ కరన్ వేసిన 2వ బంతిని జడేజా బౌండరీకి తరలించాడు. దీంతో భారత్ 300 పరుగులు పూర్తి చేసింది.
ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 95 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. 276/3 ఓవర్ నైట్ స్కోరుతో భారత్ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఆదిలోనే ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగారు. దీంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే కేఎల్ రాహుల్(129), రహానె(1) వికెట్లు సమర్పించుకుంది. రిషబ్ పంత్(4), జడేజా(1) క్రీజులో ఉన్నారు.
రెండో టెస్టు తొలి రోజు ఆచితూచి ఆడిన భారత్... రెండో రోజు గతి తప్పింది. ఆట ప్రారంభమైన పది నిమిషాలకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔటవ్వగా... రహానె (1) కూడా వెనుదిరిగాడు.