భారత బ్యాడ్మింటన్‌ యువ కెరటం లక్ష్యసేన్‌ అద్భుతం చేశాడు. ఇండియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్‌, సింగపూర్‌ షట్లర్‌ లోహ్‌ కీన్‌ యూను 24-22, 21-17 తేడాతో ఓడించాడు. 20 ఏళ్ల ఈ యువ ఆటగాడికి ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్ 500 టైటిల్‌ కావడం ప్రత్యేకం.


అంతకు ముందు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ద్వయం మహ్మద్‌ అషాన్‌, హెండ్రా సెటియావన్‌ను 21-16, 26-24 తేడాతో వరుస గేముల్లో  ఓడించింది. స్వర్ణ పతకం అందుకుంది.






నువ్వా నేనా అన్నట్టే


తొలి గేమ్‌లో లక్ష్యసేన్‌, కీన్‌ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. 2-2, 4-4, 6-6తో సమంగా దూసుకుపోయారు. లక్ష్యసేన్‌ వేగం పెంచి తనదైన రీతిలో స్మాష్లు బాదేశాడు. 13-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కీన్‌ పుంజుకున్నాడు. మ్యాచ్‌ 18-14తో ఉన్నప్పుడు వరుసగా 6 పాయింట్లు సాధించి 20-20తో స్కోరు సమం చేశాడు. గేమ్‌ పాయింట్‌ సమీపించడంతో ఇద్దరూ పట్టువదలకుండా శ్రమించారు. 21-21, 22-22 వరకు సమంగా పోరాడారు.  22 వద్ద ఒక పాయింట్‌ సేవ్ చేసుకున్న లక్ష్య గేమ్‌ పాయింట్‌కు చేరువయ్యాడు. ఆ తర్వాత మరో పాయింటు సాధించి 24-22 గేమ్‌ గెలిచాడు. రెండో గేమ్‌లో  లక్ష్యసేన్‌ ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. 6-6తో స్కోరు సమమైనా ఆ తర్వాత వరుస స్మాష్‌లు సంధించాడు. 20-17తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచేశాడు.






Also Read: ప్రపంచంలోని బెస్ట్‌ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్‌ డోన్ట్‌ వర్రీ ప్లీజ్‌!!


Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!


Also Read: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ