Women's Premier League 2024: వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు సంచలనం సృష్టించారు. స్టార్‌ ప్లేయర్లను కాదని అనామక ప్లేయర్ల కోసం ప్రాంచైజీలు ఓ రేంజ్‌లో పోటీపడ్డాయి. అత్యధిక ధర పలుకుతారేమో అనుకున్న క్రికెటర్లు పరిగణనలోకే రాలేదు. ఏ మాత్రం ఊహించిన టీమిండియా అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లకు భారత అమ్మాయిలు అధిక ధర సొంతం చేసుకున్నారు. ఈ ప్లేయర్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. 22 ఏళ్ల చండీగఢ్‌ పేసర్‌ కాష్వీ గౌతమ్‌ ఏకంగా రూ. రెండు కోట్లకు అమ్ముడుపోయింది.  డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని భారత క్రికెటర్‌గా ఆమె నిలిచింది. కనీస ధర రూ.10 లక్షలతో వేలంలోకి వచ్చిన 20 ఏళ్ల కాశ్వీ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. యూపీ వారియర్స్‌ను దాటి గుజరాత్‌ జెయింట్స్‌ ఆమెను సొంతం చేసుకుంది. కర్ణాటక యువ బ్యాటర్‌ వ్రిందా దినేష్‌ రూ. 1.30 కోట్లు పలికింది.  యూపీ రూ.1.3 కోట్లు చెల్లించింది. ఈ కర్ణాటక బ్యాటర్‌ భారీషాట్లు ఆడగలదు. ఇటీవల ఇంగ్లాండ్‌- ఏతో సిరీస్‌లో భారత్‌- ఏ తరపున కాశ్వీ, వ్రిందా ఆడారు.  కాష్వీ గౌతమ్‌ ప్రాథమిక ధర రూ. 10లక్షలు కాగా ఏకంగా 20 రెట్లు అదనంగా అంటే రూ. రెండు కోట్లకు గుజరాత్‌ జట్టు దక్కించుకుంది.



 మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (WPL Auction) రెండో మినీ వేలం ముంబై(Mumbai)లో జరుగుతోంది. ఈ ప్రీమియర్‌ బిడ్డింగ్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్లు, సీనియర్‌ ఆటగాళ్ల కంటే యంగ్ ప్లేయర్ల కోసం లక్షలు, అవసరమైతే కోట్లు వెచ్చిస్తున్నాయి. తాజాగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తెలంగాణ అమ్మాయికి జాక్‌ పాట్‌ తగిలింది. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన్ద త్రిష అండర్-16, 19, 23 విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్‌ టీమ్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడింది. ఇప్పుడు ఏకంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. త్రిషను రూ. 10 లక్షలతో గుజరాత్ జెయింట్స్‌ (Gujarat Giants) ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.


అంతకు ముందు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ రెండో మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్‌ను భారీ ధరకు ఢిల్లీ (Delhi capitals) దక్కించుకుంది. 40 లక్షల క‌నీస ధ‌ర‌తో రిజిస్టర్‌ అయిన ఆల్‌రౌండ‌ర్ అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్‌ను దక్కించుకునేందుకు ముంబై ఇండియ‌న్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ చివరి వరకూ గట్టిగా పోరాడాయి. అయితే చివరకు చివ‌ర‌కు ఢిల్లీ రూ. 2 కోట్లతో అన్నాబెల్‌ను దక్కించుకుంది. అన్నాబెల్‌కు టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఆమె 14 మ్యాచుల్లో 288 ర‌న్స్ సాధించింది. బౌలింగ్‌లోనూ స‌త్తా చాటుతూ 23 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఇక రూ.30 ల‌క్షల క‌నీస ధ‌రతో రిజిస్టర్‌ అయిన లిచ్‌ఫీల్డ్ కోసం యూపీ వారియ‌ర్స్, గుజ‌రాత్ జెయింట్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు యువ బ్యాటర్‌ ఫోబె లిచ్‌ఫీల్డ్‌ను గుజ‌రాత్ రూ. 1 కోటికి దక్కించుకుంది. తొలిసారి డబ్ల్యూపీఎల్‌ వేలంలోకి వచ్చిన ఆమె ఊహించని ధరకు అమ్ముడుపోయింది. రూ. 30 లక్షల కేటగిరీలో వచ్చిన ఆమె కోసం గుజరాత్‌ కోటీ రూపాయలు ఖర్చు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫోబె లిచ్‌ఫీల్డ్‌ 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎడమ చేతి వాటం బ్యాటర్‌ అయిన లిచ్‌ఫీల్డ్‌.. 2022లో భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆసీస్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన లిచ్‌ఫీల్డ్‌.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌తో పాటు ఉమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్), దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తోంది.