Sachin Tendulkar Virat Kohli Most Runs in ODI World Cup: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. భారత జట్టు ఆటగాళ్ల రికార్డు ప్రపంచ కప్‌లో చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. ఈ విషయంలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.


వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్తుత ఆటగాళ్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ 26 ఇన్నింగ్స్‌ల్లో 1030 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్ ప్లేయర్ల జాబితాలో కూడా అతను నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్‌ల్లో 2278 పరుగులు చేశాడు. అతను ఆరు సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు సాధించాడు.


వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 21 ఇన్నింగ్స్‌ల్లో 1006 పరుగులు చేశాడు. అతను నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 17 ఇన్నింగ్స్‌ల్లో 978 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ ఆరు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. రాహుల్ ద్రవిడ్ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ 21 ఇన్నింగ్స్‌ల్లో 860 పరుగులు చేశాడు.


ఓవరాల్ లిస్ట్‌లో సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 42 ఇన్నింగ్స్‌ల్లో 1743 పరుగులు చేశాడు. అతను ఐదు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర మూడో స్థానంలో ఉన్నాడు. అతను 35 ఇన్నింగ్స్‌ల్లో 1532 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. బ్రియాన్ లారా నాలుగో స్థానంలో ఉన్నాడు. లారా 33 ఇన్నింగ్స్‌ల్లో 1225 పరుగులు చేశాడు. 


మరోవైపు జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల చోటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీమిండియాకు పుష్కరకాలానికంటే పైగానే  సేవలు అందిస్తున్న  వెటరన్ బ్యాటర్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను  భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ)  టీ20ల నుంచి తప్పించనుందా..?  ఇప్పటికే  పొట్టి ఫార్మాట్ లో ఈ ద్వయాన్ని పక్కనబెట్టిన  బీసీసీఐ..  త్వరలోనే  టీ20లలో వీరి భవితవ్యం తేల్చడానికి సిద్ధమైంది. బీసీసీఐ కొత్తగా   నియమించబోయే  చీఫ్ సెలక్టర్ (అజిత్ అగార్కర్ పేరు రేసులో ఉంది)  కు ముందున్న అతి పెద్ద టాస్క్ కూడా ఇదేనని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.