Virat Kohli : శ్రీలంకతో జరిగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి ఓవర్‌లోనే రోహిత్ వికెట్ పోయిన తర్వాత వచ్చిన కోహ్లీ మొదటి నుంచి ధాటిగా ఆడుతున్నారు. ఈక్రమంలో ఓ సచిన్ రికార్డును అధిగమించాడు .


ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగుల మైలురాయి రికార్డు ఇప్పటి వరకు సచిన్‌, కోహ్లీ పేరు మీద ఉంది. శ్రీలంకపై ఇవాళ(గురువారం)34 పరుగులు చేసిన తర్వాత సచిన్‌ రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు ఒక క్యాలెండర్ ఇయర్లో ఏడుసార్లు 1000 పరుగులు సాధించారు. ఇప్పుడు కోహ్లీ 34 పరుగులు చేయడంతో ఎనిమిదోసారి ఆ ఫీట్‌ సాధించిన క్రికెటర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు కోహ్లీ