IND vs PAK In Asia Cup 2025: ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌తో భారతదేశం పాల్గొనడంపై సందేహాలు తలెత్తడంతో, ఆసియా కప్ 2025 అనిశ్చితిని ఎదుర్కొంది. చివరికి, భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిమానులు ఈ పోరును చూడబోతున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంకా టీమ్ ఇండియాను ప్రకటించలేదు. భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు, వీరు పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్‌లో ఈ ఆటగాళ్లకు పాకిస్తాన్‌తో ఆడే అవకాశం లభించవచ్చు.

పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న ఆటగాళ్లు!

భారత్, పాకిస్తాన్ మధ్య 2012-13 నుంచి ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు అంతర్జాతీయ (ICC), ఆసియా (ACC) ఈవెంట్స్‌లో మాత్రమే జరుగుతాయి. దీని కారణంగా, భారత జట్టులో చేరిన యువ ఆటగాళ్లు ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఆటగాళ్లలో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్, జితేశ్ శర్మ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు తిలక్ వర్మ, రింకు సింగ్ కూడా పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

భారతదేశానికి చెందిన ఈ ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురికి ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో అవకాశం లభించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ యూఏఈతో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఉన్నారు. ఒకవేళ టీమ్ ఇండియా పాకిస్తాన్‌తో జరిగే ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోతే, ఈ ఆటగాళ్లు పాకిస్తాన్‌తో తమ కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడతారు. అదే సమయంలో రింకు సింగ్, జితేశ్ శర్మలు వేచి చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను సెప్టెంబర్ 14న మ్యాచ్‌కు ముందే ప్రకటించవచ్చు.

గిల్, కుల్దీప్ టీ20 ఆడలేదు

ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. అదే సమయంలో భారత జట్టులో శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు, వీరు పాకిస్తాన్‌తో ODI మ్యాచ్‌లు ఆడారు, కానీ టీ20లో ఇంతకు ముందు పాకిస్తాన్‌తో ఎప్పుడూ ఆడలేదు. సెప్టెంబర్ 14న గిల్, కుల్దీప్ పాకిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడవచ్చు.

భారత స్పిన్నర్లు, ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ , వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది పెడతారని వసీం అక్రమ్ హెచ్చరిస్తున్నారు. "పాకిస్తాన్‌ మిడిల్-ఆర్డర్ బ్యాటింగ్  భారత స్పిన్నర్లతో ఇబ్బంది పడుతుంది. జస్ప్రీత్ బుమ్రాను భయంకరంగా కనిపించవచ్చు కానీ, కానీ వరుణ్, కుల్దీప్ వంటి వారు బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. బంతి పిచ్ అయిన తర్వాత ఒక బ్యాటర్ బంతిని రీడ్ చేస్తున్నాడంటే ఏమి జరుగుతుందో తెలియదని అర్థం" అని చెప్పారు.  

పాకిస్తాన్ లాగానే భారతదేశం కూడా 2025 ఆసియా కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కుల్దీప్ యాదవ్ ఎంత ఇబ్బందికరంగా ఉంటాడో చూపించడానికి ఇది సరిపోతుంది.

భారత XI ఇదే కావచ్చు: అభిషేక్ శర్మ - ఓపెనర్, శుభ్‌మన్ గిల్ (VC) - ఓపెనర్, తిలక్ వర్మ - బ్యాటర్, సూర్యకుమార్ యాదవ్ (C) - బ్యాటర్, సంజు సామ్సన్ (WK) - కీపర్-బ్యాటర్, హార్దిక్ పాండ్యా - ఆల్ రౌండర్, శివమ్ దూబేే - ఆల్ రౌండర్, అక్షర్ పటేల్ - స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి - స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ - స్పిన్నర్ , జస్‌ప్రీత్ బుమ్రా - పేసర్.

బెంచ్: అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, జితేష్ శర్మ.