T20 ప్రపంచ కప్‌లో తమ మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా జోరును కొనసాగించాలని, ముందుకు సాగాలని చూస్తుంది. ఆదివారం జరిగే సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది. టీమ్ ఇండియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో భారత్ అంచనా తుదిజట్టు ఇదే!
కేఎల్ రాహుల్: కుడిచేతి వాటం బ్యాటర్ పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో 4, 9 స్కోర్‌లను మాత్రమే నమోదు చేశాడు. అతను మంచి ఓపెనింగ్ అందించాల్సి ఉంది. అయితే అతను కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జేలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


రోహిత్ శర్మ: భారత కెప్టెన్ నెదర్లాండ్స్‌పై 52 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్‌ను ప్రారంభంలోనే కోల్పోయిన తర్వాత అతని ఇన్నింగ్స్ భారత్‌కు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది.


విరాట్ కోహ్లీ: భారత మాజీ కెప్టెన్ ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో 82, 62 స్కోర్‌లను నమోదు చేశాడు. అతను పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో అస్సలు అవుట్ కాలేదు. అతను రబడ, నోర్జే, షమ్సీ వంటి వారిని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.


సూర్యకుమార్ యాదవ్: భారతదేశపు Mr.360 నెదర్లాండ్స్‌పై కేవలం 25 బంతుల్లో 51 పరుగులు చేసి తన రేంజ్‌ను ప్రదర్శించాడు. నం.2 అంతర్జాతీయ టీ20 బ్యాటర్ ప్రోటీస్‌తో తన ఆటతో రాణించాలి.


హార్దిక్ పాండ్యా: పాకిస్థాన్‌పై మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి, 3 వికెట్లు తీసి 40 పరుగులు చేశాడు.


దినేష్ కార్తీక్: 37 ఏళ్ల బ్యాటర్ డెత్ ఓవర్లలో ఎంత బాగా ఆడతాడో తెలిసిందే.


అక్షర్ పటేల్: గాయపడిన రవీంద్ర జడేజాకు ఎడమచేతి వాటం స్పిన్నర్ సరైన ప్రత్యామ్నాయం. నెదర్లాండ్స్‌పై కీలక వికెట్లు తీయగలిగాడు.


రవిచంద్రన్ అశ్విన్: ఈ ఆఫ్ స్పిన్నర్ నెదర్లాండ్స్‌పై రెండు వికెట్లు తీశాడు, అయితే డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్, ఎయిడెన్ మార్క్రమ్ వంటి వారికి వ్యతిరేకంగా ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి.


భువనేశ్వర్ కుమార్: ఆస్ట్రేలియాలో భువీ బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అతను రన్-ఫ్లో, స్ట్రైక్‌ను కూడా నియంత్రించగలడు.


మహ్మద్ షమీ: ఈ పేసర్ ఒక వైపు పరుగుల ప్రవాహాన్ని నియంత్రించగలిగాడు. కానీ పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు.


అర్ష్‌దీప్ సింగ్: ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో అర్ష్‌దీప్ ఐదు వికెట్లు తీశాడు. అయితే అతను పరుగులు కూడా ఇస్తున్నాడు. అతను తన ఎకానమీ రేటును అదుపులో ఉంచుకోగలడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.