Ruturaj Gaikwad & Yashasvi Jaiswal: వెస్టిండీస్‌తో భారత జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. నిజానికి IPL 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ చాలా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా దేశవాళీ మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

యశస్వి జైస్వాల్ ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ ఆడాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. అదే సమయంలో కరీబియన్ టూర్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లను ప్రయత్నించవచ్చని ఇప్పుడు నమ్ముతారు. భారత్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డొమినికాలో, రెండో టెస్టు ట్రినిడాడ్‌లో జరగనుంది.

ఛతేశ్వర్ పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్‌కి అవకాశం!వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఛతేశ్వర్ పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్‌ని ప్రయత్నించవచ్చు. అదే సమయంలో ఛతేశ్వర్ పుజారా జట్టులో చోటు దక్కించుకున్నా... ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వవచ్చు. 

డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత జట్టు నెలరోజుల విరామం తర్వాత  వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమిండియా మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.  టెస్టు సిరీస్‌తో మొదలయ్యే  ఈ  పర్యటన.. టీ20లతో ముగియనుంది. అయితే  నెల రోజుల తర్వాత క్రికెట్ ఆడనున్నా  బీసీసీఐ మాత్రం.. టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఏదో ఒక ఫార్మాట్‌లో మరోసారి  విశ్రాంతినివ్వనుందని సమాచారం. 

గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత  రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లను  పొట్టి ఫార్మాట్‌లో పట్టించుకోవడం లేదు.  2024 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో యువ జట్టును  సిద్ధం చేస్తూ సీనియర్లకు రెస్ట్ ఇస్తోంది. దీని ప్రకారం.. కరేబియన్ జట్టుతో  టీ20 సిరీస్‌కు  రోహిత్ ఎలా ఆడడు. ఇక మిగిలింది టెస్టు, వన్డేలే.  నెల రోజుల తర్వాత ఆడనున్నా  ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  

జులై 12-16 మధ్య తొలి టెస్టు, 20-24 నుంచి  రెండో టెస్టు జరుగనుండగా జులై 27 నుంచి ఆగస్టు 1 వరకూ  మూడు వన్డేలు జరుగుతాయి.  ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్మాట్‌ నుంచి  రోహిత్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ కాస్త నీరసంగా కనిపించాడు.  అతడు తన రిథమ్‌ను కోల్పోయాడు. అందుకే విండీస్ టూర్‌లో కొంత భాగం అతడికి  విశ్రాంతినివ్వనివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే ఇది టెస్టులా, వన్డేలా..? అన్నది ఇంకా నిర్ణయించలేదు.  రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం..’ అని  చెప్పాడు.   డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత రోహిత్.. ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.