PAK Vs ENG: ఫైనల్ మ్యాచ్‌కు మారిన కండీషన్స్ - ఒకవేళ మ్యాచ్ జరగకపోతే?

ఆదివారం పాకిస్తాన్, ఇంగ్లండ్‌ల మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు మ్యాచ్ కండీషన్స్ మారాయి.

Continues below advertisement

2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఓడించగా, జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ భారత్‌ను చిత్తు చేసి ఫైనల్ పోరులో ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని ఇంగ్లండ్ వాతావరణ నివేదిక తెలిపింది. షెడ్యూల్ చేసిన రోజున మ్యాచ్ జరగని పక్షంలో సోమవారం రిజర్వ్ డే ఉంది. శనివారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఫైనల్ కోసం ఆట పరిస్థితుల్లో కొన్ని మార్పులను ప్రకటించింది.

Continues below advertisement

"ఈవెంట్ టెక్నికల్ కమిటీ (ETC) రిజర్వ్ రోజున అదనపు ఆట సమయాన్ని రెండు గంటల (ప్లేయింగ్ షరతులలోని నిబంధన 13.7.3) నుంచి నాలుగు గంటలకు పెంచింది." అని తన అధికారిక ప్రకటన పేర్కొంది. ఫైనల్ కోసం నాకౌట్ దశలో ఒక మ్యాచ్‌ జరగాలంటే ప్రతి జట్టుకు 10 ఓవర్లు అవసరం.

"నాకౌట్ దశలో ఒక మ్యాచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతి జట్టుకు 10 ఓవర్లు అవసరమని గమనించవచ్చు. అవసరమైతే ఓవర్లు తగ్గించి షెడ్యూల్ చేసిన రోజున మ్యాచ్ రోజున మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి." అని ప్రకటనలో పేర్కొన్నారు.

"ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ని పూర్తి చేయడానికి అవసరమైన కనీస ఓవర్ల సంఖ్యను వేయలేకపోతే మాత్రమే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళుతుంది. రిజర్వ్ డే రోజున ఆట భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది షెడ్యూల్ చేసిన మ్యాచ్ రోజు నుంచి ఆట కొనసాగింపుగా ఉంటుంది." అన్నారు.

ఆదివారం నాటి మ్యాచ్‌కు ఇంకా 30 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉండగా, ఫైనల్ మ్యాచ్ పూర్తి కావడానికి సోమవారం అదనంగా నాలుగు గంటల అదనపు సమయం ఉంది. మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్ల స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ ఆడతారు. వాతావరణం కారణంగా సూపర్ ఓవర్ పూర్తి కాకపోతే, అప్పుడు పాకిస్తాన్, ఇంగ్లండ్‌లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

Continues below advertisement