India's T20 World Cup Glory Celebrations:

  ముంబై జనసంద్రంలా మారింది. ముంబై విజయోత్సవంతో తడిసి ముద్దయింది. లక్షలాది అభిమానుల కోలహలాల మధ్య... టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు ముంబైలో అడుగుపెట్టింది. క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ముంబైలో ఎటుచూసినా త్రివర్ణ పతాకాలే రెపరెపలాడాయి. మువ్వన్నెల జెండాలను చేతపట్టిన అభిమానులు... భారత్‌ మాతాకి జై నినాదాలతో గర్జిస్తున్నారు.






కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన అభిమానులు జయహో భారత్‌ అంటూ నినదించారు.  ఆ జన గర్జనలో సముద్ర ఘోష ఏ మాత్రం వినపడలేదు. నారిమన్‌ పాయింట్‌ నుంచి ముంబై వాంఖడే స్టేడియం వరకూ ఓపెన్‌ టాప్‌ బస్సులో టీమిండియా ఆటగాళ్లు.. భారీ జన సందోహం మధ్య ప్రయాణిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో అభిమానులకు సన్మానం చేయనున్నారు. బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానాను కూడా అందించనున్నారు.