Bumrah Injury Update: వెన్నునొప్పితో బాధపడుతున్నభారత స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా వేగంగా కోలుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌ను బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతున్నాడు. అయితే త‌ను గాయం నుంచి కోలుకుని, బౌలింగ్ చేస్తున్ వీడియోను తాజాగా బుమ్రా పంచుకున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో త‌ను ఈ వీడియోను పోస్టు చేస్తున్నాడు. రోజుకింత చొప్పున మెరుగ‌వుతున్న‌ట్లు బుమ్రా అందులో పేర్కొన్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో చివ‌రిసారిగా బుమ్రా అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సిడ్నీలో జ‌రిగిన  ఆ టెస్టులో వెన్ను నొప్పితో త‌ను రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయ‌లేక పోయాడు. ఆ త‌ర్వాత గాయం చిన్న‌దనే చెప్పిన‌ప్ప‌టికీ, ఇంగ్లాండ్ తో జ‌రిగిన లిమిటెడ్ ఓవ‌ర్ల క్రికెట్ సిరీస్, అలాగే ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి త‌ను దూర‌మ‌య్యాడు. ఎన్సీఏలో త‌ను కొంత‌కాలంగా శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. 

ఐపీఎల్ కు అందుబాటులోకి..బుమ్రా రిక‌వ‌రీ చూస్తుంటే ఐపీఎల్ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ అభిమానులు హేపీగా ఫీల‌వుతున్నారు. వ‌చ్చేనెల 24న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ తో ముంబై జ‌ట్టు తొలి మ్యాచ్ ఆడ‌నుంది. అప్ప‌టివ‌ర‌క‌ల్లా త‌ను కోలుకుంటాడ‌ని భావిస్తున్నారు. ఇక గ‌తేడాది బుమ్రా నామ సంవత్స‌రంగా గ‌డించింది. టెస్టుల్లో 71 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అలాగే ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టి, రికార్డుల‌కెక్కాడు. భార‌త్ త‌ర‌పున అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన పేస‌ర్ గా రికార్డు నెల‌కొల్పాడు. అలాగే బిలో 20 స‌గ‌టుతో 200 వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్ గా నిలిచాడు. ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్ల‌లోనూ అద‌ర‌గొట్టాడు. ఆస్ట్రేలియాలో జ‌రిగిన బోర్డ‌ర్- గావ‌స్క‌ర్ ట్రోఫీలో 32 వికెట్లు తీసి అద‌రొగొట్టి, ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీ ప‌ట్టేశాడు. 

ప్ర‌పంచ‌క‌ప్ లోనూ..అంత‌కుముందు జూన్ లో వెస్టిండీస్ లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్పులోనూ స‌త్తా చాటాడు. కేవ‌లం 8 స‌గ‌టుతో 15 వికెట్లు తీసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అవార్డును ద‌క్కించుకున్నాడు. అలాగే భార‌త్ రెండోసారి ఈ టోర్నీ సాధించ‌డంలోనూ కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక ఐసీసీ అవార్డుల‌ను కొల్ల‌గొట్టాడు. ప్ర‌తిష్టాత్మ‌క ఐసీసీ టెస్టు ప్లేయ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు, ఐసీసీ మెన్స్ క్రికెట‌ర్ ఆఫ్  ద ఇయ‌ర్ అవార్డుల‌ను కూడా కొల్ల‌గొట్టాడు. అలాగే ఐసీసీ ప్ర‌క‌టించిన ఐసీసీ టీమ్ ఆఫ్ టెస్టు, టీ20 జ‌ట్ల‌లోనూ త‌ను ప్రాతినిథ్యం వ‌హించాడు. ఇక బుమ్రా తిరిగి రావ‌డం ముంబైకి చాలా ప్ల‌స్ పాయింట్.. ఇప్ప‌టికే టోర్నీలో 5 సార్లు చాంపియ‌న్ గా నిలిచిన ముంబై.. ఆరోసారి విజేత‌గా నిలిచి రికార్డుల‌కెక్కాల‌ని బావిస్తోంది. 

Read Also: Starc Vs IPL: ఐపీఎల్ కోస‌మే ఐసీసీ మెగా టోర్నీ స్కిప్..! ఆసీస్ స్టార్ పై విమ‌ర్శ‌లు..