వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్‌ను 4-1తో గెలిచినట్లు అవుతుంది. ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ జరగనుంది. తుదిజట్టులో భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది.


వెస్టిండీస్ తుదిజట్టు
షామర్హ్ బ్రూక్స్, షిమ్రన్ హెట్‌మేయర్, నికోలస్ పూరన్ (కెప్టెన్), డెవాన్ థామస్ (వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, ఒడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెకాయ్, హేడెన్ వాల్ష్, రొవ్‌మన్ పాల్


టీమిండియా తుదిజట్టు
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్