వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్‌ను వైట్ వాష్ చేసినట్లు అవుతుంది. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో మూడో మ్యాచ్ జరగనుంది. తుది జట్టులో భారత్ ఒకే ఒక్క మార్పు చేసింది. అవేష్ ఖాన్ స్థానంలో ప్రసీద్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.


వెస్టిండీస్ తుదిజట్టు
షాయ్ హోప్ (వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షామరా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కీసీ కార్టీ, అకిల్ హుస్సేన్, జేసన్ హోల్డర్, కీమో పాల్, హేడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్


టీమిండియా తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయర్ అయ్యర్, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ కృష్ణ