ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్న అత్యంత కొద్దిమంది క్రికెటర్లలో ఒకరు ఎంఎస్ ధోని. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దేశానికి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఒక కెప్టెన్.


యువకులకు మద్దతు ఇవ్వడం, మైదానంలో వారి అత్యుత్తమ ఆటను ప్రదర్శించేలా గేమ్‌ను ప్రేరేపించడంలో ధోని దిట్ట. గత కొద్ది సంవత్సరాలుగా మోడర్న్ క్రికెట్ సూపర్ స్టార్లుగా ఎదిగిన ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్.


వీరు ముగ్గురూ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో సర్‌ప్రైజ్ లైవ్ చేశారు. ఈ లైవ్‌లో వీరు ముగ్గురూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ మధ్యలో ఇతర క్రికెటర్లను కూడా యాడ్ చేసి వారిపై జోకులు వేసుకుంటున్న సమయంలో వీరిని సర్‌ప్రైజ్ చేస్తూ ధోని లైవ్ లోకి వచ్చారు.


అయితే ధోని ఈ లైవ్‌లో ఎక్కువ సేపు ఉండలేదు. ధోనితో పాటు తన భార్య సాక్షి కూడా ఈ వీడియోలో కనిపించారు. కాసేపు ధోని లైవ్‌లో ఉండాలని రిషబ్ పంత్ సాక్షిని కోరగా... ఈ లోపే ధోని ఫోన్ తీసుకుని కాల్ డిస్‌కనెక్ట్ చేశారు.