2023 వన్డే ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని టీమిండియా ప్రారంభించింది. శనివారం ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో తుది జట్టు లాంటిదేమీ ఉండదు. 15 మందిలో ఎవరైనా బ్యాటింగ్ చేయవచ్చు, ఎవరైనా బౌలింగ్ చేయవచ్చు. కాబట్టి జట్టులో ఉన్నవారందరికీ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే వస్తుంది.


భారత్ (బ్యాటింగ్ XI, ఫీల్డింగ్ XI)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ


ఇంగ్లండ్ (బ్యాటింగ్ XI, ఫీల్డింగ్ XI)
డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్