టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నా ఫలితం నెగిటివ్‌గా రావడంతో ఇంగ్లండ్ ఈసారి బ్యాటింగ్ వైపు మొగ్గు చూపింది. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసింది. మాథ్యూ పార్కిన్సన్, శామ్ కరన్ స్థానంలో రీస్ టాప్లే, ఫిల్ సాల్ట్ ఆడనున్నారు.


మరోవైపు టీమిండియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా స్థానంలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు.


ఇంగ్లండ్ తుదిజట్టు
జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్, రీస్ టాప్లే


టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్