MS Dhoni:  భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిన్న సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సందేశం ఒకటి వైరల్ గా మారింది. ఒక ఎక్సైటింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ ఫేస్ బుక్ వేదికగా మహీ ఒక సందేశం ఉంచాడు. దీనిపై రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఐపీఎల్ కు ధోనీ రిటైర్ మెంట్ పలకనున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. వాటన్నింటికీ తెరదించుతూ.. ఎంఎస్ ధోనీ ఆ విషయం ఏంటో చెప్పేశాడు. 


అది ధోనీకి సంబంధించిన విషయం కాదు. ఓరియో కుకీస్ ప్రచారంలో భాగంగా మహీ ఆ సందేశం పెట్టాడు. కుకీస్ ప్రచారంలో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ధోనీ మాట్లాడాడు. ఓరియో కంపెనీకి చెందిన మార్కెటింగ్ అధికారి మాట్లాడుతూ.. ఓరియో బిస్కెట్లను మొదటిసారి భారత్ లో ప్రవేశపెడుతున్నామని చెప్పాడు. దానికి ఒక విలేకరి ఇంతకుముందే ఓరియో భారత్ లో ఉంది కదా అని ప్రశ్నించాడు. దానికి ధోనీ బదులిస్తూ.. ఓరియో 2011లో భారత్ లోకి వచ్చింది. అప్పుడు టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా భారత్ లో ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కూడా భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది అని లాజికల్ గా సమాధానం చెప్పాడు. దీనిపై అభిమానులు వాట్ ఏ పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.