MS Dhoni viral video: మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాలుగా భారత క్రికెట్ జట్టు కోసం కలిసి క్రికెట్ ఆడారు. ధోనీ తర్వాత, విరాట్ మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు, ఇప్పుడు కోహ్లీ కూడా T20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. MS ధోనీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది, ఇందులో విరాట్ గురించి అడిగినప్పుడు, అతను చెప్పిన సమాధానం ఆసక్తిగా ఉంది.
విరాట్ కోహ్లీ, MS ధోనీ మంచి స్నేహితులు, వీరి స్నేహంలో కోహ్లీ ధోనీని ఎంతగా గౌరవిస్తారో స్పష్టంగా కనిపిస్తుంది. ధోనీ కూడా అతని గురించి శ్రద్ధ తీసుకుంటాడు. టెస్ట్ నుంచి కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనికి కాల్ చేసిన ఏకైక వ్యక్తి MS ధోనీ అని కోహ్లీ ఒకసారి చెప్పాడు, చాలా మంది దగ్గర అతని ఫోన్ నంబర్ ఉన్నప్పటికీ కాల్ చేయలేదని చెప్పాడు.
విరాట్ కోహ్లీ చాలా వినోదాన్ని పంచుతాడు - MS ధోనీ
కొన్ని రోజుల క్రితం MS ధోనీ చెన్నైకి వచ్చాడు, ఇక్కడ విమానాశ్రయంలో అతను దిగిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీ చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ధోనీ స్టేజ్పై కూర్చుని ఉండగా, విరాట్ కోహ్లీ గురించి అడిగినప్పుడు, "అతను చాలా బాగా పాడుతాడు, మంచి గాయకుడు. అతను చాలా మంచి డాన్సర్ కూడా. అతను మిమిక్రీ కూడా బాగా చేస్తాడు. అతను మూడ్లో ఉన్నప్పుడు చాలా వినోదాన్ని పంచుతాడు " అని అన్నాడు.
నేను వచ్చే 15-20 ఏళ్ల పాటు CSKలో ఉంటాను - MS ధోనీ
ఈవెంట్లోనే టీ20 జర్నీపై కూడా పలు ప్రశ్నలు ఎదుర్కొన్నాడు ఎంఎస్డీ. దీనికి సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో MS ధోనీ తన రిటైర్మెంట్ గురించి స్పందించాడు. తనకు ఇంకా తొందరలేదని చెప్పాడు. ధోనీ మాట్లాడుతూ, "నేను ఆడినా ఆడకపోయినా వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల వరకు పసుపు జెర్సీ (CSK జెర్సీ రంగు) ధరించి అక్కడే కూర్చుంటాను."