సౌభాగ్యం అంటే "భర్త తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం". అందుకే 14 సంవత్సరాలు అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం అనే రెండు వరాలు కావాలని పట్టుపట్టిన కైకేయిని చూసి దశరథుడు " ఈ రోజు వరకు నువ్వు గొప్ప సౌభాగ్యవతివి కానీ  ఇవాల్టి నుంచి నువ్వు సౌభాగ్యాన్ని కోల్పోయావు పో అంటాడు. 


అలాగే హరివంశంలో... నారదుడు స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీదేవి అంత:పురంలో కృష్ణుడు ఉన్న సమయంలో ఆ పువ్వు గొప్పదనాన్ని వివరించి బహూకరిస్తాడు.అప్పుడు కృష్ణుడు తన ప్రక్కనే ఉన్న రుక్మిణికి ఇస్తాడు. నీ భార్యలందరిలో ఎవరు గొప్ప సౌభాగ్యవతి అని ఆలోచించేవాడిని..రుక్మిణి అని ఇప్పుడు తెలిసిందని నారదుడు అంటాడు. ఈ విషయం తెలిసి సత్యభామ అలుగుతుంది. నిజానికి ఆ పువ్వు తనకి ఇవ్వనందుకు కాదు..ఏకాంతంలో ఉన్నప్పుడు "భామా  అందరిలోకి నువ్వే గొప్ప సౌభాగ్యవతివి, అని చెప్పేవారు కదా స్వామీ ఆ మాట అబద్ధం అని తెలిసిపోయింది కదా.. నేను సౌభాగ్య హీనురాలనని అందరి ముందు బుుజువైందంటుంది". సత్యభామ కన్నీళ్లకు కరిగిపోయిన కృష్ణుడు ఏకంగా పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి నాటుతాడు.


Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో


సౌభాగ్యం అంటే భర్త మనసులో తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం. అలాంటి సౌభాగ్యంతో పాటూ సుమంగళియోగం ఉండేందుకు నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే మంచిదని చెబుతారు పండితులు.  


సౌభాగ్యం, సుమంగళీ యోగం కోసం పఠించాల్సిన శ్లోకం


1.నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే  
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ  


2.నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ 
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః 


3.పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ  
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే  


4.పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః  
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతే  


5.క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్  
పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమే  


6.ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ


7.సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ


బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ దేవి, సరస్వతి దేవి, గంగా దేవి, భూదేవి, సావిత్రి, పార్వతి సహా ఎందరో దేవతా మూర్తులు ఈ శ్లోకం పఠించారు.


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?