జ్ఞానమే కొలమానం



  • వాల్మీకి బోయవాడు. ఈయన రచించిన రామాయణం హిందువులకు పరమపవిత్రమైన గ్రంథం అయింది.

  • వ్యాసుడు చేపలుపట్టే బెస్తకన్యకు జన్మించాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదాలు, ఉపనిషత్తులు ఈయన రచించినవే. అందుకే వేద వ్యాసుడు అని పూజిస్తారు

  • గౌతముడు కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

  • ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టారు

  • కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవారు

  • జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు.

  • వశిష్టుడు ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈయన భార్య అరుంధతి నిమ్న కులానికి చెందిన మహిళ. అయినప్పటికీ ఇప్పటికీ నూతన దంపతులు  అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

  • అగస్త్య మహాముని మట్టి కుండల్లో పుట్టారు.

  • మతంగ మహర్షి నిమ్న కులంలో పుట్టి బ్రాహ్మణుడయ్యాడు. ఈయన కుమార్తె మాతంగకన్య ఓ శక్తి దేవత.

  • ఐతరేయ మహర్షి ఒక కిరాతకుడి కుమారుడు. ఆయన రాసినవే ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయోపనిషత్తు.

  • ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. ఈయన రుషులందరికీ ఆచార్యుడు

  • జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తల్లి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానంతో బ్రాహ్మణుడు అయ్యాడు.


Also Read: భక్త రామదాసుపై చిన్నచూపేల, ఇకనైన పలకవా రామచంద్రా


ఉన్నతవంశాల్లో పుట్టినా ధర్మం నిర్వర్తించక బహిష్కరణకు గురైనవారు



  • భూదేవి కుమారుడు  క్షత్రియుడైన నరకుడు రాక్షసుడయ్యాడు

  • బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైనా  రాక్షసులయ్యారు

  • రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడయ్యాడు

  • త్రిశంకుడు క్షత్రియుడు. కానీ తన ప్రవర్తన కారణంగా చండాలడు అయ్యాడు.

  • విశ్వామిత్రుడు క్షత్రియుడే కానీ తన జ్ఞానంతో బ్రాహ్మణుడైనాడు.

  • శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు 


పురాణకాలం, పూర్వకాలం, ప్రస్తుతం కాలం అనే తేడాలేదు.తెలివితేటలు, జ్ఞాన సంపద ఏ ఒక్క కులానికో, వర్ణానికో మాత్రమే పరిమితం కాలేగు,కాబోదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్య  కిరణాలు ఆపలేనట్టు మీలో నిజంగా టాలెంట్ అనేది ఉంటే మీ ఎదుగుదలను ఆపలేరు.ఓ ఒక్క వర్ణమో, కులమో ఆధిపత్యం చెలాయించలేరుని ఈ మహర్షులంతా ప్రూవ్ చేశారు. మీరు మహర్షులో కాదో నిర్ణయించుకోవాల్సింది మీరే...


ఈ కథనంలో తప్పొప్పులు, వివాదాస్పదం అంశాలు వెతకడం మానేసి... నేర్చుకోవాల్సిన విషయం ఏంటన్నది అర్థం చేసుకుంటే చాలని చెబుతున్నారు పండితులు.


Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు