గ్రహాలకు మూలం సూర్యుడు. సూర్యుడికి అధిదేవత ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడే ఒక్కో గ్రహానికి ఉండే అధిష్టాన దేతలను నియమిస్తాడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆదేశానుసారమే సంచరిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. అయితే మీ రాశి, మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. మరి ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలో చూడండి..
తులాఈ రాశివారికి శుక్రుడు అధిపతి. పూజించాల్సిన జ్యోతిర్లింగం మహాకాళేశ్వరం. జన్మనక్షత్రం రోజు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి.
శ్లోకంఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాంఅకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం !!
వృశ్చికంఈ రాశివారికి కుజుడు అధిపతి. దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరం.
శ్లోకంపూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతంనురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి!!
Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి
ధనస్సుఈ రాశివారికి గురుడు అధిపతి. పూజించాల్సిన జ్యోతిర్లింగం విశ్వేశ్వర లింగం. కింద శ్లోకాన్ని పారాయణం చేయడం, కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా శని, గురు గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శ్లోకంసానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే !!
మకరం ఈ రాశివారి అధిపతి శని. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం భీమశంకరం. తెలిసీ తెలియక చేసిన పాపాలు, దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ క్షేత్ర దర్శనం.
శ్లోకంయం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చసదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి !!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
కుంభంఈ రాశికి కూడా అధిపతి శని. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం కేదారేశ్వరం. గ్రహపీడలు, శత్రుబాధల నుంచి విముక్తి కలగాలంటే ఈ రాశివారు ఈ కేదారేశ్వరుడిని దర్శించుకోవాలి
శ్లోకంమహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే !!
మీనంఈ రాశికి అధిపతి గురుడు. వీరు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం త్ర్యంబకేశ్వరం. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. ఈ స్వామి దర్శనం అత్యంత శుభకరం.
శ్లోకంసహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశేయద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే
ఓం నమ:శివాయ
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి