Money Heist Robber In Hyd  :   రాజకీయ పార్టీలు రకరకాల పద్దతుల్లో తమ ప్రత్యర్థులపై పోరాటం చేస్తూంటాయి. ఈ క్రమంలో బీజేపీపై ఇలాంటి పోరాటాలు చేసేవారు ఎక్కువే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా..బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రచార సమరం జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మనీ హిస్ట్ వెబ్ సీరిస్‌లో బ్యాంకులను కొల్లగొట్టే పాత్రధారి బొమ్మతో ఓ వ్యక్తి నిరసన ప్రదర్శన నిర్వహించాడు. 



 

WE ONLY ROB BANK.. YOU ROB THE WHOLE NATION’ #BYEBYE MODI అని రాసిఉన్న ప్ల కార్డులను పట్టుకుని నగరంలోని పలు బ్యాంకులు, పెట్రోల్‌ బంకులు, కాచీగూడ రైల్వే స్టేషన్‌, బీహెచ్‌ఈఎల్‌, జహీరాబాద్‌లోని ఎల్‌ఐసీ ఆఫీస్‌ వద్ద ఆ వ్యక్తి కనిపించాడు. అయితే అది ఒకరా లేకపోతే... ఓ గ్రూప్‌గా ఇలా మారి ఫోటోలు దిగి నిరసన చేశారాఅన్నదానిపైస్పష్టత లేదు. 





 మోదీకి వ్యతిరేకంగా రాజధానిలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వెలుస్తున్నాయి. గురువారం పరేండ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో బైబై మోదీ హ్యాస్‌ట్యాగ్‌తో సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ భారీ హోర్డింగ్‌లను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. అయితే ఈ మనీహిస్ట్ నిరసన చేసింది టీఆర్ఎస్ వ్యక్తా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. 





ఈ నిరసన సోషల్ మీడియాలోనూ వైరల్‌ అయింది. ఇది టీఆర్ఎస్ నేతల పనేనని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు