✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ.. ఇంకో 20 ఏళ్లు ఇంతే.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ABP Desam   |  29 Aug 2021 03:20 PM (IST)
1

అనంతరం మంత్రి జవహార్ నగర్ మున్సిపాలిటీలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరో మంత్రి మల్లా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

2

మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అది కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలోనే కావడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ అందుకు వేదికైంది. ఉస్మానియా వర్శిటీలో క్రీడా క్లస్టర్స్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద దీనికి నిధులు కేటాయించారు.

3

ఈ సందర్భంగానే క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఆ సందర్భంలోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 15, 20 ఏళ్లపాటు అధికారంలో ఉండటం ఖాయమని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

4

అనంతరం క్యాంపస్‌లో కాసేపు విద్యార్థులతో మంత్రి సరదాగా గడిపారు. ఖేలో ఇండియా పథకం కింద చేపడుతున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

5

దాదాపు రూ.13 కోట్లతో ఓయూలో ఈ పనులు చేపట్టారు. యూనివర్సిటీలోని మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ రవీందర్‌తో పాటు క్రీడాశాఖ, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

6

యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి టీ తాగుతూ సౌకర్యాల గురించి ఆరా తీశారు. దాదాపు గంటకు పైగా పిచ్చాపాటిగా విద్యార్థులతో మాట్లాడారు.

7

ఓయూ ఉద్యమాల గడ్డ అని, ఇక్కడకు రాగానే ఒళ్ళు పులకరించిపోతుందని మంత్రి అన్నారు. కొత్త జోనల్ విధానం కోసం ఇన్ని రోజులు ప్రభుత్వం ఆగిందని, ఇక త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • హైదరాబాద్
  • In Pics: రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ.. ఇంకో 20 ఏళ్లు ఇంతే.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.