Yadadri Temple: యాదాద్రీశుని దర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్ట
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు అధికారులు ఉన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఆలయంలో భక్తులకు అభివాదం చేస్తూ సీఎం రేవంత్, మంత్రులు ముందుకు సాగారు.
సీఎం రేవంత్ సహా ఇతర మంత్రులు ఆలయంలో దీపారాధన చేశారు.
ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో సీఎం యాదాద్రీశుని దర్శించుకున్నారు.
లక్ష్మీ నరసింహ దర్శనం అనంతరం సీఎం, మంత్రులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని సీఎం చిత్రపటంతో వస్త్రాన్ని తయారుచేసి ఆయనకు అందజేశారు. దీన్ని చూసిన రేవంత్ రెడ్డి సదరు అభిమానిని అభినందించారు.
స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.