In Pics : భద్రాద్రి రామాలయాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ, చరిత్రలో రెండో సారి వంతెనపై రాకపోకలు బంద్!
భద్రాచలం వద్ద గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభద్రాచలం వద్ద గోదావరిలో 19.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది.
ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాయంత్రం 5 గంటలకు 61.80 అడుగులకు చేరుకుంది.
1976 నుంచి నది 60 అడుగుల మార్క్ను దాటడం ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 5 గంటల నుంచి వంతెనపై రాకపోకలు నిలిపేశారు.
భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు.
భద్రాచలం వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారిగా తెలుస్తోంది.
1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.
మళ్లీ 36 సంవత్సరాల తర్వాత భారీగా వరద వస్తుండడంతో అధికారులు రాకపోకలపై ఆంక్షలు విధించారు.
గురువారం సాయంత్రం 5 గంటల నుంచి గోదావరి వంతెనపై ఆంక్షలు అమలులోకి రాగా 48 గంటల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కు రాకపోకలు ఆగిపోయాయి.
భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి
ముంపులో గోదావరి పరివాహక ప్రాంతాలు