వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మెక్కలు, చెట్లు ఉండకూడదు!
పండ్లు, పువ్వులు , ఆకులతో నిండిన నీడ చెట్లు ఇంటికి అందాన్నిస్తాయి. చెట్లు , మొక్కలు ఇంటిని మాత్రమే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాయి . కానీ ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెట్లు, మొక్కలు నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి ప్రధాన ద్వారం లేదా తలుపు దగ్గర కొన్ని చెట్లు, మొక్కలు ఉండటం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇలాంటి చెట్లు అశాంతి, ఆర్థిక సమస్యలు , ప్రతికూలతను పెంచుతాయి.
మనీ ప్లాంట్- దీనిని ధనపు మొక్క అని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క శుక్ర గ్రహానికి సంబంధించినది మరియు ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటిలో సరైన దిశలో లేదా స్థలంలో నాటితే చాలా లాభం ఉంటుంది. కానీ మనీ ప్లాంట్ ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి బయట నాటకూడదు. దీనివల్ల ధన నష్టం జరుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం రావి చెట్టు ఇంటి గుమ్మానికి దగ్గరగా ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటిన రావి చెట్టు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. రావిని హిందూ ధర్మంలో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు, అయితే దీనిని ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం దగ్గర నాటకుండా ఉండాలి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముళ్ల లేదా పాలు వచ్చే మొక్కలను ఉంచకూడదు. ఇది పొరుగువారితో లేదా బంధువులతో సంబంధాలను దెబ్బతీస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చింత, మందార, రేగు వంటి చెట్లు కూడా ఉండకూడదు. ఇంటి దగ్గర చింత చెట్టు ఉండటం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, మందార మొక్క కూడా ఇంటి ముందు ఉండటం అశుభంగా భావిస్తారు.