తిరుపతి, కాశీ, అయోధ్య, రామేశ్వరం! సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ఆత్మనగరం ఏంటో తెలుసా?
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19 లేదా 28వ తేదీలలో జన్మించిన వారి నంబర్ 1 అవుతుంది. సూర్యుడు అధిపతి అవ్వడం వల్ల వీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీరి ఆత్మ నగరం అయోధ్య, ఇక్కడ వీరు తమ శక్తిని సరైన దిశలో అందిస్తారు.
2,11,20,29 తేదీల్లో జన్మించినవారి నంబర్ 2 అవుతుంది. వీరు చంద్రునిచే ప్రభావితమవుతారు. వీరు చాలా భావోద్వేగంగా ఉంటారు. వారి అంతర్బుద్ధి శక్తి అద్భుతంగా ఉంటుంది, చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తుల సోల్ సిటీ బృందావనం
3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. వీరు తెలివైన వారు, అత్యంత జ్ఞానులు కూడా. వారణాసి నగరం వీరికి అదృష్టంగా నిరూపించవచ్చు, ఎందుకంటే ఈ నగరం వారి ఆత్మ నగరం.
జనన సంఖ్య 4, 13, 22, 31 కలిగిన వారిని రాహువు పాలిస్తాడు. వీరు తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా గడపడానికి ఇష్టపడతారు. ఉజ్జయిని వీరి ఆధ్యాత్మిక నగరం
5,14,23 జనన సంఖ్య కలిగిన వారిపై బుధ గ్రహం పాలన ఉంటుంది. ఈ అంకె కలిగిన వ్యక్తులలో కమ్యూనికేషన్ నైపుణ్యం చాలా బాగుంటుంది. వీరు మిత్ర స్వభావంతో పాటు మధురమైన స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిని తప్పకుండా సందర్శించాలి
6, 15, 24 ల్లో జన్మించిన వారి న్యూమరాలజీ నంబర్ 6 అవుతుంది. శుక్రుని శక్తితో సంబంధం కలిగి ఉండటం వల్ల వారి జీవితంలో అందం, విలాసవంతమైన జీవితం, సౌకర్యాలు ఉంటాయి.వీరికి ఆత్మీయ నగరం రిషికేష్. ఈ నగరం వారి పూర్వ జన్మతో ముడిపడి ఉంది.
7, 16, 25 కలిగిన వారిని కేతు గ్రహం ప్రభావితం చేస్తుంది. వీరు చాలా రహస్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంకె 7 కలిగిన వారు జీవితంలో ఒక్కసారైనా రుద్రప్రయాగకు వెళ్ళాలి. ఈ ప్రదేశానికి వెళ్ళడం వల్ల వారికి మనశ్శాంతి లభిస్తుంది.
8, 17, 26 కలిగిన వారిని శని గ్రహం పాలిస్తుంది. వీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. దీనితో పాటు, వీరు కర్మపై చాలా నమ్మకం ఉంచుతారు. ఈ వ్యక్తులకు పూరీ జగన్నాథ్ వెళ్ళమని సలహా ఇస్తారు సంఖ్యాశాస్త్ర నిపుణులు
జనన సంఖ్య 9, 18, 27 కలిగిన వారి గ్రహాధిపతి కుజుడు. వీరు తమ దూకుడు, బలంతో చాలా ప్రసిద్ధి చెందారు. వీరు జీవితకాలంలో ఒక్కసారి అయినా రామేశ్వరం వెళ్లాలి.