SBI ATM Charges : ATM లావాదేవీలపై SBI గైడ్లైన్స్.. కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే
ఫిబ్రవరి 1, 2025 నుంచి SBI ATM లావాదేవీలపై కొత్త నిబంధనలు ఇచ్చింది. ఉచిత పరిమితి, ఛార్జీలు ఒకే విధంగా వర్తిస్తాయని తెలిపింది. అవేంటో చూసేద్దాం.
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి కస్టమర్కు ఇప్పుడు ప్రతి నెలా ఎస్బిఐ ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలు లభిస్తాయి. అంటే మొత్తం 15 ఉచిత లావాదేవీలు నెల మొత్తం మీద లభిస్తాయి.
అదేవిధంగా కస్టమర్లు తమ ఖాతాలో 1 లక్ష కంటే ఎక్కువ సగటు బిల్లును కలిగి ఉంటే.. వారికి రెండు రకాల ATMలలో అపరిమిత ఉచిత లావాదేవీలు లభిస్తాయి.
ఉచిత లావాదేవీ పరిమితిని మించి డబ్బులు విత్డ్రా చేస్తే.. SBI ATMలలో 15 రూపాయవు + GST, ఇతర బ్యాంక్ ATMలలో 21 రూపాయాలతో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఎస్బీఐ ఏటీఎంలలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, మినీ స్టేట్మెంట్ తీసుకోవడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఈ సేవలకు 10 రూపాయలు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఖాతాలో తగినంత డబ్బు లేకపోవడం వల్ల ATM లావాదేవీ విఫలమైతే.. SBI 20 రూపాయలు+ GST పెనాల్టీ విధిస్తుంది. ఈ నిబంధన ఇప్పటికే అమలులో ఉంది.
అయితే మే 1వ తేదీ 2025 నుంచి RBI కూడా ATM ఇంటర్ఛేంజ్ ఫీజును పెంచాలని నిర్ణయించింది. దీని తరువాత ఉచిత పరిమితి దాటిన తర్వాత, కస్టమర్లు ఒక్కో లావాదేవీకి 23 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
కాబట్టి కస్టమర్లు ఉచిత పరిమితిని గుర్తుంచుకో లేకపోతే ATMని పదేపదే ఉపయోగించకపోవడం మంచిది. అదే సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి ఈ మార్పులు చేసినట్లు ఎస్బిఐ తెలిపింది.