Krait Snake : ఇండియాలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. కాటేస్తే సెకన్లలోనే మనిషి చనిపోతాడట
విషపూరిత జాతులలో కొండచిలువ, క్రైట్, రస్సెల్ వైపర్ వంటి పాములు ఉన్నాయి. వీటి కాటుకు సకాలంలో చికిత్స అందకపోతే వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో క్రైట్ ఒకటి. ఈ పాము తన ప్రాణాంతక విషానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఒక్క క్షణంలోనే మనిషి చనిపోయేలా చేస్తుంది.
ఇండియాలో ఎక్కువగా కనిపించే నాలుగు అత్యంత విషపూరితమైన పాములలో ఇది ఒకటి. కొండచిలువ కంటే క్రైట్ ప్రమాదకరమైనదిగా చెప్తారు. ఇది రాత్రి సమయంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు.
క్రైట్కు మెరిసే నల్లని స్కిన్, దానిపై తెల్లటి లేదా పసుపు చారలు ఉంటాయి. దీని శరీరం సన్నగా, పొడవుగా ఉంటుంది. ఇది వేగంగా జారిపోతుంది.
ఈ పాము సాధారణంగా పొలాలు, అడవులు, గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పాము పొడి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
ఈ పాము విషంలో న్యూరోటాక్సిక్ ఉంటుంది. ఇది నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. కాటు వేసిన తర్వాత ప్రారంభ లక్షణాలు తిమ్మిరి, కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్షవాతం వస్తాయి.
కొన్నిసార్లు ప్రజలు నిద్రపోయేప్పుడు దీని కాటుకు గురవుతారు. ఎందుకంటే ఇది మంచం, దుస్తుల మధ్య సులభంగా దాక్కుంటుంది.
సాధారణ క్రైట్ పళ్లు చిన్నగా, సన్నగా, సూదిలాగా ఉంటాయి. ఈ పాము ఎవరినైనా కాటు వేస్తే.. కాటు వేసిన అనుభూతి కూడా కలగదట. అందుకే అర్థం చేసుకునే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది.