Health Risks of Excess Salt : ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే.. ఎవరు తగ్గించి తింటే మంచిదంటే
ఉప్పును రక్తపోటు ఉన్నవారు ఎక్కువ తినకూడదు. ఎందుకంటే ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని తగ్గించి తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేసినా పర్లేదు.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా అధిక సోడియం తీసుకోవడం ప్రమాదకరంగా చెప్తారు. రాక్ సాల్ట్ రక్తపోటు, శరీరంలో నీటిని పేరుకునేలా చేసి గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి అలాంటివారు ఉప్పునకు దూరంగా ఉంటే మంచిదట.
కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే.. శరీరం నుంచి అదనపు సోడియం బయటకు వెళ్లదు. ఆ పరిస్థితిలో రాతి ఉప్పు కిడ్నీ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని చెప్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉప్పు హానికరం కావచ్చు. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది.
థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే సైంధవ లవణంలో అయోడిన్ ఉండదు. దీని కారణంగా థైరాయిడ్ అసమతుల్యత మరింత పెరగవచ్చు.
గర్భధారణ సమయంలో మహిళలు సోడియం, అయోడిన్ సమతుల్యంగా తీసుకోవడం చాలా అవసరం. ఇటువంటి పరిస్థితిలో రాతి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి, బిడ్డకు ఇద్దరికీ హాని కలగవచ్చట.
పెద్దవాళ్లకి తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఉప్పు వాడకం వారి మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.