Gunde Ninda Gudi Gantalu Today మార్చి 20 ఎపిసోడ్: మీనాకి సపోర్ట్ గా శ్రుతి, రోహిణి .. బాలుకి ఆహారం అయిపోనున్న కాంతం అత్త - గుండె నిండా గుడి గంటలు మార్చి 20 ఎపిసోడ్ హైలెట్స్!

సత్యం కుటుంబాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్న కాంతం..కావాలనే సాంబార్ మీద పోసుకుని మీనాపై నోరు పారేసుకుంటుంది. నువ్వు గొడవపడాలి..నేను నువ్వు కొట్టుకోవాలి శాశ్వతంగా నీ చెల్లెలు ఈ ఇంటికి దూరం కావాలని అనుకుంటాడు సంజయ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అన్ని కోట్ల ఆస్తి ఉన్న మీకు ఈ చీర ఓ లెక్కా..అయినా నా భార్య నిజంగా సాంబార్ పోయాలి అనుకుంటే ముఖంపై పోస్తుంది అని కూల్ చెప్పి కడుక్కుని రండి అని పంపిస్తాడు బాలు.

బాలు రూమ్ లో వాష్ రూమ్ ఎక్కడుందో చూపించి వచ్చేస్తుంది శృతి. లోపల తాళిబొట్టు కొట్టేస్తుంది కాంతం.
ఎక్కువ సేపు మంచితనం ముసుగువేసుకుని కూర్చోలేను..ఏదో ఒకటి చేయాల్సిందే అంటాడు సంజయ్. ఆ బాలు గాడు మన్నుతిన్న పాములా ఎందుకు కూర్చున్నాడని నీలకంఠం అంటాడు. ఇంతలో వచ్చిన కాంతం తాను తాళి కొట్టేసిన విషయం చెబుతుంది
దాచేసిన తాళిని తీసుకెళ్లి కార్లో పెడుతుంది కాంతం. ఆ సమయంలో బయట కాల్ మాట్లాడిన శృతి.. సరదాగా ఫంక్షన్ ఏర్పాట్లు వీడియో తీసుకుంటుంది.. ఆ వీడియోలో కాంతం కారు దగ్గరకు వచ్చి లోపలకు వెళ్లడం తీస్తుంది...
మీనా తాళి తీసుకురా అని ప్రభావతి అంటుంది. లోపల వెతికి వచ్చిన మీనా కనిపించలేదని చెబుతుంది. ఏదైనా పోవాలి అంటే ముందు ఉండాలి కదా రెచ్చిపోతుంది కాంతం. కొన్నారో లేదో సమయానికి పోయిందని అబద్ధం చెబుతున్నారేమో అంటుంది.
కాంతం ఆగకుండా బాలుని టార్గెట్ చేస్తుంటుంది..ఇంతలో అక్కడకు వచ్చిన శృతి మాదే తప్పే అని మాట్లాడితే అస్సలు ఊరుకోం అంటుంది. మా మీన అలాంటిది కాదంటుంది ప్రభావతి. రోహిణి కూడా మీనా గురించి మాకు తెలుసు అంటుంది.
చివరిసారిగా మన గదిలోకి ఎవరు వెళ్లారని బాలు అడిగితే..కాంతం అత్తయ్య అని చెబుతుంది మీనా. అంటే అంతా కలసి నన్నే అంటారా అని మరింత రెచ్చిపోతుంది కాంతం. నాకు ఏ బంగారం అవసరం లేదు..గొడవలు వద్దు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటుంది మౌనిక
ఈ రచ్చంతా జరుగుతుంటే శృతి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. పుస్తెలతాడు పోయిందని చెబుతాడు రవి. శృతికి అనుమానం వచ్చి కార్లో చూస్తుంది బాక్స్ దొరుకుతుంది. తెచ్చి సైలెంట్ గా ఇస్తుంది
శృతి కారును ఆన్ చేసి కార్లో బాక్స్ చూసి షాక్ అవుతుంది. పుస్తెలతాడు తీసుకొస్తుంది. మీనాను ఏ ఆధారంతో అన్నారని నిలదీస్తుంది. ఈవిడ మీనాకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తుంది శ్రుతి. తప్పనిసరి పరిస్థితుల్లో సారీ చెబుతుంది కాంతం. ఆ తర్వాత మౌనిక కార్యక్రమం జరుగుతుంది
గుండెనిండా గుడిగంటలు మార్చి 21 ఎపిసోడ్ లో.. మరోసారి మీనాను టార్గెట్ చేస్తుంది ప్రభావతి. అసలు మీకు ఏం తెలుసు అంటూ ఎంట్రీ ఇచ్చిన శృతి...తాళిని కాంతం దొంగతనం చేసిన సంగతి బయటపెట్టేస్తుంది