✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

వైఎస్‌ఆర్‌సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన అంశాలు ఇవే

Sheershika   |  27 Apr 2024 04:19 PM (IST)
1

విద్య,వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు,పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి అనే అంశాలను ప్రధాన్యతలుగా తీసుకొని మేనిఫెస్టో రూపొందించారు.

2

వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి, 17 మెడికల్ కాలేజీలు పూర్తి, నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిషి ల్యాండింగ్ సెంటర్లు, భోగాపురం ఎయిర్‌పోర్టు, నాడు నేడు పథకం కింద ప్రభుత్వ బడులు, ఆసుపత్రులు, భూముల రీ సర్వే, ఆక్వా యూనివర్శిటీ, లా యూనివర్శిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్శిటీ, గిరిజిన ఇంజినీరింగ్ కాలేజీ, గిరిజిన యూనివర్శిటీ పూర్తి చేస్తామన్నారు.

3

పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తూ ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. మిగలిపోయిన పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

4

పిల్లల చదువును ప్రోత్సహించేందుకు ఇచ్చే జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా ఇచ్చే డబ్బులను 17000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

5

ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల తీసుకున్న రుణం పది లక్షల వరకు పూర్తి వడ్డీని గరిష్టంగా ఐదేళ్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. పాతికవేల లోపు జీతం తీసుకునే ఉద్యోగులకుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల పథకాలన్నీ వర్తింపు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే ఇల్ల స్థలం 60 శాతం ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది.

6

బీసీలు, నాయి బ్రాహ్మణులకు ఇప్పుడు ఇస్తునన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే సామాజిక భవనాల కట్టడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు హామీ. ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాల కొనసాగించేందుకు హామీ.

7

దళితులకు ఇప్పుడు ఇస్తున్న హామీలు కొనసాగిస్తూనే... మొత్తం జనాభాలో 50 శాతం దళితులు ఉన్న ప్రాంతంలో ఐదు వందల కుటుంబాలు ఉంటే పంచాయితీలుగా చేస్తామన్నారు.

8

వ్యవసాయ రంగంలో రైతులకు ఇస్తున్న 13500ను 16000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

9

వైద్య రంగంలో ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తూనే... వచ్చే ఐదేళ్లలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఐదు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, 15 కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హామీ. హార్ట్ రోగులకు విశాఖ, గుంటూరు, కర్నూలులో వైద్య హబ్‌లు ఏర్పాటు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్‌ కేర్ సెంటర్లు.

10

విద్యారంగంలో మార్పుల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఐదేళ్లలో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన కొనసాగింపు నాడు నేడు కొనసాగింపు, 2025 నుంచి ఐపీ విధానంలో విద్యాబోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ‌్‌ల పంపిణీ, యూనివర్శిటీ సిబ్బంది నియాకం వేగవంతం చేస్తాం.

11

లా నేస్తం మరో ఐదేళ్లు కొనసాగిస్తూనే న్యాయవాదులు వెల్ఫేర్‌ ఫండ్‌కు వంద కోట్లు కేటాయించనున్నారు.

12

యువత ఉపాధి కోసం జాబ్ ఓరియంటెడ్ కరికులమ్ తీసుకొస్తామన్నారు. 175 స్కిల్‌ హబ్‌లు, 26స్కిల్ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్శిటీ తిరుపతిలో ఏర్పాటుకు హామీ. అబ్బాయిలకు 2500, అమ్మాయిలకు 3000 వేల పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఇస్తామన్నారు.

13

పింఛన్లు కొనసాగిస్తూనే ఇప్పుడు ఇచ్చే దాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తామన్నారు. 2028 జనవరి నుంచి 250, 2029 జనవరిలో మరో 250 పెంచి 3500 ఇస్తామన్నారు.

14

మత్స్యకారులకు ఇచ్చే భరోసాను లక్షరూపాయలకు పెంచారు. వారి భవిష్యత్ కోసం నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆటో ట్యాక్సీ నడుపుకునే డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కొనసాగిస్తూనే టిప్పర్‌, లారీ డ్రైవర్లను ఇందులో చేర్చారు. డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల బీమా వర్తింపచేస్తారు. వాహనాల కొనుగోలుకు తీసుకునే రుణాలపై 3 లక్షల వరకు ఆరు శాతమే వడ్డీ ఉండేలా మిగతాది ప్రభుత్వం భరించనుందన్నారు.

15

వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా మహిళలకు సున్న వడ్డీ రుణాలు ఇచ్చే పథకం కొనసాగుతుందని ఇది 3 లక్షల వరకు పెంచుతున్నట్టు పేర్కొన్నారువైఎస్‌ఆర్ కళ్యాణమస్తు- షాదీ తోపా కింద ఇచ్చే సాయం వచ్చే ఐదేళ్లు కనసాగనుంది.

16

వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పేరుతో అగ్రవర్ణాల మహిళలకు ఇచ్చే చేదోడును 1.05 లక్షలకు పెంచబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో 15000 చొప్పున మరో అరవై వేలు అందిస్తారు. మొత్తంగా ఏడు విడతల్లో 1.05లక్షల లబ్ధి చేకూరనుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎలక్షన్
  • వైఎస్‌ఆర్‌సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన అంశాలు ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.