Railway Refund Rules: మీరు పొరపాటున రైలు మిస్ అయ్యారా? టికెట్ అమౌంట్ ఇలా రీఫండ్ చేసుకోండి
ఎవరైనా టికెట్ బుక్ చేసుకున్నా పొరపాటున రైలు మిస్ అయితే చాలా మంది టికెట్ డబ్బులు పోయాయని అనుకుంటారు. కానీ రైల్వే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి తెలుసుకుంటే మీ ఒత్తిడిని కొంచెం తగ్గుతుంది. ప్రతి సందర్భంలోనూ మీ డబ్బులు పోవు.
మీరు పొరపాటున సమయానికి రైలును అందుకోకపోతే, టికెట్ డబ్బులు తిరిగి పొందవచ్చు. దీని కోసం, రైల్వే టికెట్ డిపాజిట్ రసీదు అంటే టిడిఆర్ ఫైల్ చేసే అవకాశం కల్పిస్తుంది. కానీ రైలు మిస్ అయిన ఒక గంటలోపు ప్రయాణికుడు ఆ పని చేయాలి. ఆ తర్వాత ఫైల్ చేస్తే ఆ క్లెయిమ్ చెల్లదని రైల్వే రూల్స్ చెబుతున్నాయి.
మీరు IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా TDR ఫైల్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు వెబ్సైట్, యాప్ లో లాగిన్ అవ్వాలి. తరువాత My Account విభాగంలో TDR సెలక్ట్ చేయాలని గుర్తిస్తారు. అక్కడ మీరు ప్రయాణం వివరాలు, టికెట్, రైలు మిస్ అవ్వడానికి గల కారణాన్ని సరిగ్గా పేర్కొనాలి
మీరు అనుకోకుండా రైలు మిస్ అయితే, మీకు మొత్తం డబ్బు రిఫండ్ రాదు. రైల్వే సర్వీస్ ఛార్జీలు, మరికొంత నగదు కట్ అవుతుంది. కొంత నగదు రిఫండ్ చేస్తారు. మీరు TDRను ఎంత త్వరగా ఫైల్ చేశారనే దానిపై ఈ రూల్ ఆధారపడి ఉంటుంది.
రైలు నిర్ణీత సమయానికి ముందే బయలుదేరితే.. లేదా జరిగిన పొరపాటు రైల్వే శాఖ, రైల్వేది అయితే కనుక పూర్తి రీఫండ్ వస్తుంది. అందుకోసం మీరు సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. రైల్వే మీరు చేసిన క్లెయిమ్ను పరిశీలిస్తుంది. మీరు చెప్పింది నిజమని, మీ తప్పిదం లేదని తేలితే కోత లేకుండా డబ్బులు అందుతాయి.
టీడీఆర్ ఫైల్ చేసిన తరువాత క్లెయిమ్ కోసం సాధారణంగా వారం రోజుల నుంచి 3 వారాల సమయం పడుతుంది. టికెట్ బుక్ చేసిన అదే అకౌంట్లోకి నగదు వస్తుంది. చాలా సార్లు త్వరగానే రీఫండ్ అవుతుంది.