Vijayadashami 2025 : విజయదశమి రోజు కన్యారాశిలో బుధుడి ఉదయం! ఈ 3 రాశులవారికి విద్య, ఉద్యోగం, వ్యాపారంలో శుభ ఫలితాలు!
ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 2 న జరుపుకోనున్నారు. ఈసారి దసరా రోజు గ్రహాలు, నక్షత్రాల గమనంతో చాలా మార్పులున్నాయి. ఈ రోజు బుధుడు కన్యారాశిలో ఉదయిస్తాడు. బుధుడి ఉదయించిన ప్రభావం అన్ని రాశులపైనా ఉండబోతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుధుడిని తెలివి, వాక్చాతుర్యం , వ్యాపార కారకంగా పరిగణిస్తారు. బుధుడి సంచారం బావుంటే.. ఈ సమయంలో చాలా మందికి కెరీర్, విద్య ,పని రంగంలో మంచి ఫలితాలు పొందుతారు
వృషభం, సింహం ,తులా రాశులవారికి కన్యాలో బుధుడు ఉదయించడం వలన సానుకూల ప్రభావం కనిపిస్తోంది. ఈ సమయంలో ఈ వ్యక్తుల వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
బుధుడు ఉదయించడం వల్ల విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం అవుతుంది. కెరీర్లో వృద్ధి ఉంటుంది
వ్యాపారులకు ఇది లాభదాయకసమయం. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి . పెట్టుబడులలో లాభం కూడా వస్తుంది. ఐటీకి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఆవుకు గ్రాసం వేయండి. ‘ఓం బుం బుధాయ నమః’ మంత్రాన్ని జపించండి.